2 బ్రిటన్ ఉపగ్రహాలు నింగిలోకి: పీఎస్ఎల్వీ కౌంట్డౌన్ షురూ
నెల్లూరు: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఆదివారం రాత్రి 10.08 గంటలకు నింగిలోకి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి42ని పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది పూర్తిగా వాణిజ్యపరమైన ప్రయోగం.
ఈ ప్రయోగం ద్వారా బ్రిటన్కు చెందిన నోవాసర్, ఎస్1-4 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెడతారు. ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్డౌన్ ప్రక్రియ శనివారం మధ్యాహ్నం 1.08 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 33 గంటలపాటు కొనసాగిన తర్వాత పీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లనుంది.

నోవాసర్, ఎస్1-4 ఉపగ్రహాలకు సర్వే శాటిలైట్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థ రూపకల్పన చేసింది. ఇవి రెండూ భూపరిశీలన ఉపగ్రహాలు. సుదీర్ఘ విరామం తర్వాత ఇస్రో పీఎస్ఎల్వీ-సీ42 ప్రయోగం చేపట్టింది.
కాగా, శుక్రవారం సాయంత్రానికే ఇస్రోలోని అన్ని కేంద్రాల సంచాలకులు, సీనియర్ శాస్త్రవేత్తలు షార్కు చేరుకున్నారు. కౌంట్డౌన్ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఆదివారం రాత్రి 10.08గంటలకు ఈ ప్రయోగం తుది దశకు చేరుతుంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications