Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంచం కింద అట్టబాక్స్ ల్లో రూ 42 కోట్లు, ఏం చెయ్యాలని ప్లాన్, క్లాస్ వన్ కాంట్రాక్టర్ కూతురికి షాక్ !

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ (congress) పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత అధికారానికి దూరం అయిన బీజేపీ (BJP) నాయకులు అయోమయంలో పడిపోయారు. బెంగళూరు నగరంలో ఇటీవల కాలంలో ఐటీ (IT Raids) అధికారులు దాడులు చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పలు రంగాలకు చెందిన వారి మీద ఐటీ (IT)శాఖ అధికారులు దాడులు చేసి భారీ మొత్తంలో డబ్బులు, నగలు, విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకుంటున్నారు.

గురవారం బెంగళూరు (Bengaluru) నగరంలోని పలు ప్రాంతాల్లోని బంగారు నగల వ్యాపారుల జ్యువెలరీ షోరూమ్ లు, వారి నివాసాల్లో సోదాలు చేసిన ఐటీ శాఖ అధికారులు (IT Raids) విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయంలో ఐటీ శాఖ (IT Raids) అధికారులు అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం బయటకు చెప్పలేదు. గురువారం అర్దరాత్రి వరకు ఐటీ శాఖ అధికారులు సోదాలు కొనసాగాయని తెలిసింది.

IT officials seized Rs 42 crore and Rs 500 notes hidden in cardboard boxes in a flat in Bengaluru.
బెంగళూరు (Bengaluru) నగరంలో ఆదాయపన్ను శాఖ అధికారులు (IT Raids) జరిపిన సోదాల్లో కోట్లాది రూపాయల డబ్బు దొరికింది. గురువారం రాత్రి బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు (IT Raids) నిర్వహించారు.

ఆర్ టీ నగర్‌లోని రెండు చోట్ల ఐటీ అధికారులు సోదాలు (IT Raids) నిర్వహించారు. అదే సమయంలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో ఆత్మానంద కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్‌లోని ఓ గదిలో 23 అట్ట బాక్సుల్లో నింపిన 500 రూపాయల నోట్లు బయటపడ్డాయి.

అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్‌లోని బెడ్‌రూమ్‌లోని సోఫా కింద కోట్ల రుపాయల నోట్ల కట్టలు దాచారని వెలుగు చూసింది. ఏకంగా 23 అట్ట బాక్సుల్లో రూ 500 నోట్ల కట్టలు (crore) దొరికాయని, ఆత్మానంద కాలనీ నుంచి కారులో వేరే చోటికి తరలించేందుకు కొందరు సిద్ధం చేశారని ఐటీ శాఖ (IT Raids) అధికారుల అంటున్నారు. గురువారం రాత్రి ఐటీ అధికారులు దాడులు చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నారు.

IT officials seized Rs 42 crore and Rs 500 notes hidden in cardboard boxes in a flat in Bengaluru.
కోట్లాది రూపాయలు దొరికిన తర్వాత కేసుకు సంబంధించి గణేష్ బ్లాక్‌లోని బీబీఎంపీ 95వ వార్డు మాజీ కార్పొరేటర్ అశ్వతమ్మ, ఆమె భర్త ఆర్. అంబికాపతి నివాసంపై దాడి చేసిన ఐటీ శాఖ (IT Raids) అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటి వరకు దొరికిన కోట్లాది (crore)రూపాయలు ఎవరికి చెందినవి అంటూ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విషయంలో ఐటీ శాఖ (it) అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, ఫ్లాట్ ఎవరిది, డబ్బు ఎంత, డబ్బులు ఎక్కడికి తరలించడానికి రూ 42 కోట్లు (crore) సేకరించారు అనే విషయాలు ఇంకా తెలీదని అధికారులు (officer) అంటున్నారు.

అయితే బీబీఎంపీకి (BBMP) చెందిన ఓ ప్రముఖ కాంట్రాక్టర్ కుమార్తెకు (Daughter) చెందిన ఫ్లాట్ లోని మంచం కింద, సోఫా కింద అట్ట బ్యాక్స్ లో (box) నిల్వ చేసిన రూ 42 కోట్ల (crore) విలువైన రూ. 500 నోట్లను ఐటీ శాఖ (IT Raids) అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా ఈ డబ్బును తమిళనాడుకు తరలించడానికి ప్లాన్ చేశారని, కాంట్రాక్టర్ తో పాటు, ఆయన కుమార్తెను ఐటీ శాఖ అధికారులు విచారణ చేస్తున్నారని ప్రముఖ కన్నడ దినపత్రిక ప్రజావాణి వార్త ప్రచురించింది. బెంగళూరు నగరంలో శుక్రవారం కూడా ఐటీ శాఖ (IT Raids) అధికారులు వివిద ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+