కన్నడ నటులు, చెన్నై వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు, పలు ప్రాంతాల్లో సోదాలు
చెన్నై/బెంగళూరు: తమిళనాడు, కర్ణాటకలలో సినీ, వ్యాపార ప్రముఖుల ఇళ్లలో గురువారం ఐటీ సోదాలు జరిగాయి. చెన్నై, బెంగళూరులలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు జరిపారు. కన్నడ సినీ ఇండస్ట్రీ ప్రముఖుల ఇళ్ల పైన సోదాలు కలకలం రేపుతున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య, నటి రాధిక నివాసంలోను సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది.
Recommended Video
కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్, ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, కేజీఎఫ్ నిర్మాత విజయ్ కిరంగదూర్, విలన్ నిర్మాత సీఆర్ మోహన్ తదితర ప్రముఖల ఇళ్లు, కార్యాలయాలలో తనిఖీలు జరిగాయి. రెండు వాహనాల్లో వచ్చిన 8 మంది అధికారులు మహాలక్ష్మి లేఅవుట్లోని రాక్ లైన్ వెంకటేష్ నివాసం, సదాశివ2నగర్లోని పునీత్ రాజ్ కుమార్ నివాసంలో తనిఖీలు చేశారు.
చెన్నైలోని శరవణభవన్ గ్రాండ్ స్వీట్స్తో పాటు మొత్తం 23 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరిగాయి. ప్రముఖ నిర్మాతలు, వ్యాపారవేత్తల ఇళ్లలో డాక్యుమెంట్లను తనిఖీ చేశారు. తనిఖీల సమయంలో అందరి ఫోన్లు స్విచ్చాఫ్ చేయించారు. కన్నడ సినీ నటులు శివరాజ్ కుమార్, యష్, సందీప్ తదితరుల ఇళ్ల పైన సోదాలు జరిగాయి.