ఇద్దరు ఉగ్రవాదుల హతం: లొంగిపోయిన మరో ఉగ్రవాది
జమ్మూకాశ్మీర్ కుల్గామ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ కుల్గామ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మరో ఉగ్రవాదిని అరెస్ట్ చేశాయి. కుల్గామ్లో కొందరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు భద్రతా దళాలకు ముందస్తు సమాచారం అందింది.
దీంతో సోమవారం ఉదయం కుల్గామ్లోని కుడ్వాని ప్రాంతంలో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. బలగాల కదలికలతో అప్రమత్తమైన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీనికి స్పందనగా భద్రతా దళాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి.

ఈ కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు నేలకొరిగారు. వీరిని హిజ్బుల్కు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఒక ఏకే47, ఇన్సాస్ రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు.
More From
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications