వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజలే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డ పాక్: ఇద్దరు జవాన్లు, ముగ్గురు పౌరుల మృతి

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: పాకిస్థాన్ సైన్యం జమ్మూకాశ్మీర్‌లోని సరిహద్దుల్లో వరుసగా మూడో రోజు కాల్పులు తెగబడింది. కాల్పలు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్‌ రేంజర్లు సరిహద్దుల్లో పలు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు.

జమ్మూ, పూంఛ్‌ జిల్లాల్లో శనివారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు, ముగ్గురు పౌరులు మరణించారు. ఆర్‌ఎస్‌ పుర ప్రాంతంలో పాక్‌ రాత్రంతా భారీ ఎత్తున కాల్పులు జరుపుతూనే ఉందని బీఎస్‌ఎఫ్‌ అధికారి వెల్లడించారు.

J&K: 3 civilians, 2 jawans killed in ceasefire violation by Pakistan

బీఎస్‌ఎఫ్‌ జవాన్లు పాక్‌ కాల్పులను తిప్పి కొడుతున్నారని తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం అధికంగా కలిగించాలనే ఉద్దేశంతో పాక్‌ రేంజర్లు గ్రామాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు.

అర్నియా, రామ్‌గఢ్‌, సాంబా, హీరానగర్‌ సెక్టార్లలో శనివారం ఉదయం 5 గంటల వరకు కాల్పులు జరుపుతూనే ఉన్నారని చెప్పారు. అఖ్‌నూర్‌ ప్రాంతంలో ఇద్దరు గాయపడ్డారని, ఓ బాలికకు కూడా స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. పాక్ కాల్పుల నేపథ్యంలో సుమారు 9వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. మరో వెయ్యి మందికి ఆర్ఎస్ పురలో క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

English summary
Five people, including a two BSF jawan were killed and 35 others injured after Pakistan violated ceasefire for the third consecutive day on Saturday in three districts of Jammu and Kashmir along the International Border, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X