వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిపై పోలీసుల సామూహిక అత్యాచారం, అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

minor girl
జమ్ము: జమ్మూ కాశ్మీర్‌లోని రేసి జిల్లాలో ఒక బాలికను ముగ్గురు పోలీసులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈమెను గురువారం సాయంత్రం అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ మహేశ్ మెహ్తా, రేసి ఎస్‌ఎస్‌పికి వ్యక్తిగత సహాయకుడు సత్వీర్ సింగ్, స్పెషల్ పోలీసు ఆఫీసర్ కర్నైల్ సింగ్‌లు రేసిలోని తల్వారా వలస శిబిరం నుంచి కిడ్నాప్ చేసినట్లు ఒక పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుపై మార్తి ఏరియాలోని ఒక ఇంటిపై దాడి చేసి ఎఎస్‌ఐని, ఎస్‌పిఓను అరెస్టు చేసామని, సత్వీర్ మాత్రం పారిపోయాడని ఆ అధికారి చెప్పారు. యువతిని కూడా కాపాడినట్లు ఆయన చెప్పారు. సత్వీర్‌ను పట్టుకోవడానికి పెద్ద ఎత్తున గాలింపు చేపట్టినట్లు రేసి ఎస్‌ఎస్‌పి ఎంఎస్ చౌహాన్ చెప్పారు.

బాలికకు వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కోర్టులో హాజరు పర్చి మహిళా షెల్టర్‌లో ఉంచినట్లు ఆయన చెప్పారు. ఈ సంఘటన తల్వారా వలసవాదుల నిరసనలకు దారి తీసింది. వారు రోడ్లపై అడ్డంకులు సృష్టించడమే కాకుండా ధర్నాకు సైతం దిగారు.

హోస్పేటలో...

కర్నాటకలోని హగరిబోమ్మనహళ్లి తాలుకా నక్రాళ్ సమీపంలో శనివారం ఉదయం 15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. బాలిక పొలానికి వెళ్తున్న సమయంలో దుండగులు మార్గమధ్యలో అపహరించి, సమీపంలోని మొక్కజొన్న పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను గొంతు నులిమి హత్య చేశారు.

English summary
Two Jammu and Kashmir cops were arrested on Saturday for allegedly abducting and raping a minor girl in Reasi, 77 km from Jammu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X