ఎన్కౌంటర్: ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లోని బందిపూర్ ప్రాంతంలో ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టు పెట్టాయి. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ ధృవీకరించారు.
చనిపోయిన ఉగ్రవాదుల్లో ఎన్కౌంటర్లో 26/11 ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి జకీర్ ఉర్ రెహమాన్ లఖ్వీ మేనల్లుడు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, మృతి చెందిన ఉగ్రవాదులంతా లష్కరే తోయిబాకు చెందిన వారని భద్రతా బలగాలు ప్రకటించాయి.

ఉగ్రవాదుల కాల్పుల్లో ఐఏఎఫ్ కమాండర్ ఒకరు చనిపోగా, మరో ఇద్దరు జవాన్లు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. లష్కరే తోయిబాలో చేరిన కాశ్మీర్ ఫుట్బాల్ ప్లేయర్ తిరిగి జనజీవన స్రవంతిలోకి చేరిన కొన్ని గంటల్లోనే భద్రతాబలగాలు ఉగ్రవాదులను ఏరివేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications