Jagan: కౌన్సిలర్ జగన్ మోహన్ రెడ్డి హత్య కేసులో 14 మంది అరెస్ట్, కాంట్రాక్ట్ కిల్లర్, పాతకక్షలు !
బెంగళూరు/ కోలారు/ ముళబాగిల్: రాజకీయాల్లో చురుకుగా ఉంటున్న పొలిటికల్ లీడర్ జగన్ మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన కేసులో 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యక్తిగత కారణాల వలనే నగర సభ సభ్యుడు జగన్ మోహన్ రెడ్డిని హత్య చేశారని పోలీసు అధికారులు అంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి హత్య జరిగి 20 రోజులు అయ్యింది. అయితే ఈ కేసులో కాంట్రాక్ట్ కిల్లర్ తో పాటు 14 మంది అరెస్టు అయినా మరో నిందితుడు తప్పించుకున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని దేవాలయం సమీపంలో పొలిటికల్ లీడర్, నగర సభ సభ్యుడు (కౌన్సిలర్) జగన్ మోహన్ రెడ్డిని అతికిరాతకంగా హత్య చేశారు.
Illegal affair: ప్రియుడితో లేచిపోయిన నలుగురు పిల్లల తల్లి, భార్య మీద పగతో ?, శవాలు పెట్టుకుని భర్త!
నగరసభ కౌన్సిలర్
కర్ణాటకలోని కోలారు జిల్లాలోని ముళబాగిల్ (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు) నగర సభ సభ్యుడిగా ఎన్నికైన జగన్ మోహన్ రెడ్డిని జూన్ 7వ తేదీ దారుణంగా చంపేశారు. ముళబాగిల్ లోని ముత్యాలపేటలోని గంగమ్మ గుడి దేవాలయం ముందే వేకువ జామున 5 గంటల సమయంలో జగన్ మోహన్ రెడ్డిని అతి కిరాతకంగా నరికి చంపేశారు.
హత్య కేసులో 14 మంది అరెస్టు
జగన్ మోహన్ రెడ్డి హత్యతో మళబాగిల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కేసును పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. మైసూరులో జగన్ మోహన్ రెడ్డి హత్య కేసులోని కాంట్రాక్టర్ కిల్లర్ ను పోలీసులు అరెస్టు చేశారు. రాజకీయాల్లో చురుకుగా ఉంటున్న పొలిటికల్ లీడర్ జగన్ మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన కేసులో 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
వ్యక్తిగత కారణాలతో హత్య
వ్యక్తిగత కారణాల వలనే నగర సభ సభ్యుడు జగన్ మోహన్ రెడ్డిని హత్య చేశారని పోలీసు అధికారులు అంటున్నారు.14 మంది అరెస్టు అయినా మరో నిందితుడు తప్పించుకున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని గంగమ్మ గుడి సమీపంలో పొలిటికల్ లీడర్, నగర సభ సభ్యుడు (కౌన్సిలర్) జగన్ మోహన్ రెడ్డిని అతికిరాతకంగా హత్య చేశారు.