హనుమాన్ వేషధారణ, జై శ్రీరాం నినాదాలు : బెంగాల్లో షా ర్యాలీ
కోల్ కతా : బెంగాల్ గడ్డ మీద ఫైర్ బ్రాండ్ దీదీ మమతా బెనర్జీ కయ్యానికి కాలుదువ్వారు బీజేపీ చీఫ్ అమిత్ షా. తన మంది మార్బలంతో రోడ్ షో నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు అమిత్ షా. సేవ్ డెమోక్రసీ పేరుతో నిర్వహించే ర్యాలీలో హనుమాన్ వేషధారణ వేశారు. అంతేకాదు జై శ్రీరాం అని నినాదిస్తూ ముందుకుసాగుతున్నారు.
కాషాయమయం
కాసేపట్లో కోల్ కతాలోని ఎస్ప్లానడె నుంచి స్వామి వివేకానంద ఇంటివరకు అమిత్ షా భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తిచేశాయి. రోడ్ షో ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అమిత్ షా కోసం భారీ వాహనం సమకూర్చింది. దానిపై కాషాయ బెల్లూన్లను, బీజేపీ జెండాలను పెట్టింది. అంతేకాదు అమిత్ షా నిర్వహించే రోడ్ షో మార్ంలో 10 వేల బంతిపూల తోరణాలు కట్టారు. దేశంలోని వివిధ కళాబృందాలతో నాట్యం చేయిస్తున్నారు.

జెండాలు తీసివేస్తున్నారు ..
ఇటు మరోవైపు అమిత్ షా ర్యాలీ నిర్వహించే మార్గంలో బీజేపీ జెండాలను టీఎంసీ కార్యకర్తలు తీసివేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీదీ టీఎంసీ గుండాలు, పోలీసులు ఈ పనిచేస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications