పరీక్ష పేపర్ లో అలాంటి ప్రశ్నా..? ప్రొఫెసర్ సస్పెండ్.. ఎక్కడంటే..?

సాధారణంగా విద్యార్థుల పరీక్ష పేపర్ లో సిలబస్ లేని ప్రశ్న వచ్చినా.. లేకపోతే తప్పుడు ప్రశ్న వచ్చినా ఆ ప్రశ్నను తొలగించడం లేదా విద్యార్థులకు మార్కులు వేయడం చేస్తుంటారు. అయితే ఇక్కడ ఓ పరీక్ష పేపర్ లో అలాంటి ప్రశ్న అడిగినందుకు ఏకంగా ప్రొఫెసర్ ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (JMI) యూనివర్సిటీలో జరిగింది. ఇంతకూ విద్యార్థులకు ఆ ప్రొఫెసర్ ఇచ్చిన ప్రశ్న ఏంటి..?

పరీక్షలో విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టేలా.. మతవాదాన్ని రెచ్చగొట్టేలా.. ప్రశ్నలు అడిగిన ప్రొఫెసర్ ను సస్పెండ్ చేశారు అధికారులు. దిల్లీలోని ప్రముఖ యూనివర్సిటీగా పేరుగాంచిన జామియా మిలియా ఇస్లామియా(JMI) యూనివర్సిటీలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. బీఏ(ఆనర్స్) సోషల్ వర్క్ సబ్జెక్ట్ విభాగంలో నిర్వహించిన పరీక్షలో క్వచ్చన్ పేపర్ లో ఓ ప్రశ్న తీవ్ర చర్చకు దారి తీసింది. విద్యార్థుల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ ప్రశ్న ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

Jamia Professor Suspended Exam Question on Atrocities Against Muslims Sparks Major Row

ఈ క్వశ్చన్ పేపర్‌ ను ప్రొఫెసర్ వీరేంద్ర బాలాజీ షాహారే రూపొందించారు. ఈ పరీక్ష పేపర్ లో 'దేశంలో ముస్లిం మైనారిటీలపై జరుగుతున్న దారుణాలను చర్చించేందుకు తగిన ఉదాహరణలు ఇవ్వండి' అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వమని పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు జవాబు రాస్తే 15 మార్కులు అని తెలిపారు. అయితే ఈ క్వశ్చన్‌ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మేరకు యూనివర్సిటీకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆగ్రహించిన యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే ఆ ప్రొఫెసర్‌ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు పరీక్షలో ఇలాంటి ప్రశ్న ఇవ్వడంపై సదరు ప్రొఫెసర్‌ ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+