కశ్మీర్లో ఎన్నికలు వెంటనే నిర్వహించాలి...కాంగ్రెస్ డిమాండ్
జమ్ము కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ తీర్మానాన్ని అమిత్ షా శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే కశ్మీర్లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అయితే అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలోనే ఎన్నికలును రానున్న ఆరునెలల్లో నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు..ఇక కశ్మీర్లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని ఆయన తెలిపారు.
ఈనేపథ్యంలోనే గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా హింసయుత వాతవరణం ఉండేదని ఎన్నికల నేపథ్యంలో ఘర్షణలు చెలరేగేవని తెలిపారు.అయితే గత ఎన్నికల సంధర్భంగా ఎలాంటీ హింసాయుత సంఘటనలు జరగలేదని అన్నారు..దీంతో కశ్మీర్లో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాలేదని చెప్పారు.ప్రజలు సంబంధించిన అంశాలను పరిష్కరిస్తున్నామని తెలిపిన అమిత్ షా రానున్న రోజుల్లో కూడ ఎలాంటీ సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు.
Recommended Video


కాగా గత సంవత్సరం జూన్ నుండి కశ్మీర్లో రాష్ట్ర్రపతి పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే..ఈనేఫథ్యంలోనే మరో ఆరునెలల పాటు రాష్ట్ర్రపతి పాలనను పొడగించారు. ఈనేపథ్యంలోనే
ప్రతిపక్ష నేతలు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.అమిత్ పార్లమెంట్లో అడుగు పెట్టిన తర్వాత మొదటి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలోనే కశ్మీర్ ఉదంతం రసభసాగా మారింది..దీంతో ఆరు నెలల లోపే కశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications