ప్రధాని మోదీ ఎఫెక్ట్ తో తారుమారు అయిన సర్వేలు, మైండ్ బ్లాక్ సర్వే ఫలితాలు !
బెంగళూరు/బెళగావి: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు కేవలం ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. బెంగళూరులో శనివారం, ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్ షోలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీకి బూస్ట్ ఇచ్చే సర్వే విడుదల కావడంతో ఆ పార్టీ నాయకులు మంచి జోరుమీద ఉన్నారు. బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆ సర్వే తెలిపింది.
పోలింగ్ కు ఐదు రోజుల ముందు జన్ కీ బాత్-సువర్ణ న్యూస్ (కన్నడ) రెండో విడత సర్వే ఫలితాలు విడుదల చేసింది. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి మరోసారి సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సర్వే తెలిపింది. కర్ణాటకలో మొదటిసారి బీజేపీ సొంత బలంతో అధికారంలోకి వస్తుందని జన్ కీ బాత్-సువర్ణ న్యూస్ సర్వే తెలిపింది.

జన్ కీ బాత్- సువర్ణ న్యూస్ రెండో సారి కర్ణాటకలోని వివిద జిల్లాల్లో ప్రజల అభిప్రాయం సేకరించింది. ఈ సర్వేలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని వెలుగు చూసింది. ఒకవేళ అధికారంలోకి రాకపోయినా బీజేపీ మాత్రమే అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వే ఫలితాలు వెలువడటంతో బీజేపీ నాయకులు ఖుషీగా ఉన్నారు.
జన్ కీ బాత్- సువర్ణ న్యూస్ సర్వే ప్రకారం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 100 నుంచి 114 స్థానాలు వస్తాయని, ఇక బీజేపీ ప్రభుత్వం మీద నిత్యం పోరాటం చేస్తున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు 86 నుంచి 98 సీట్లు వస్తాయని, ప్రాంతీయ పార్టీ జేడీఎస్ కు 20 నుంచి 26 సీట్లు వస్తాయని, ఇతర పార్టీల అభ్యర్థులు 0 నుంచి 5 సీట్లు గెలిచే అవకాశం ఉందని సర్వే తెలిపింది.
ఇదే జన్ కీ బాత్- సువర్ణ న్యూస్ మొదట జరిపిన సర్వేలో బీజేపీకి 98 నుంచి 109 స్థానాలు వస్తాయని తెలిపింది. అయితే ఏప్రిల్ 29వ తేదీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చెయ్యడం, కాంగ్రెస్ పార్టీ మీద తనదైన శైలిలో విమర్శలు చెయ్యడంతో పరిస్థితులు తారుమారు అయ్యాయని, బీజేపీ పుంజుకుందని సర్వే తెలిపింది.

ప్రధాని నరేంద్ర మోదీ కల్యాణ కర్ణాటక, కిత్తూరు కర్ణాటక, పాత మైసూరు, కరావళి కర్ణాటక, మధ్య కర్ణాటక ప్రాంతాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించడంతో బీజేపీ బలం పుంజుకుందని, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు అలా చెయ్యలేకపోయాయని సర్వే అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టడంలో ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధించారని సర్వే తెలిపింది.
కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా, ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలన్నా 113 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈసారి బీజేపీ 114 సీట్లు వస్తాయని ఈసర్వేలో వెలుగు చూడటంతో బీజేపీకి కొంచెం బలం వచ్చినట్లు అయ్యింది. శనివారం, ఆదివారం బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోలు ఉండటంతో ఐటీ హబ్ లో కూడా పరిస్థితులు తారుమారు అయ్యే అవకాశం ఉందని జన్ కీ బాత్- సువర్ణ న్యూస్ కన్నడ సర్వే తెలిపింది.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications