తమిళనాడులో 6న సెలవుదినం: కేంద్రం సంతాప దినం, కేరళ, కర్ణాటకలో కూడా
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జ్ఞాపకార్థంగా డిసెంబరు 6ను ప్రభుత్వ సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన జారీచేసింది. ఇక నుంచి ఏటా అన్ని ప్రభుత్వ, పురపాలక శాఖలకు ఈ సెలవు వర్తిస్తుంది.
పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, రోజువారీ వేతనాలు తీసుకునే అందరికీ జీతం చెల్లింపు(పెయిడ్ హాలిడే)గా ప్రకటించారు. 75 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సోమవారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Photos : జయలలిత కు నివాళి
ఆమె మృతితో తమిళనాడు రాష్ట్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమెను కడసారి చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దయెత్తున ప్రజలు చెన్నైకి తరలివస్తున్నారు.
ఆమె పార్థీవదేహాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళుర్పిస్తున్నారు.

కేంద్రం సంతాప దినం
జయలలిత మృతి చెందిన నేపథ్యంలో మంగళవారం(డిసెంబర్)ను కేంద్ర ప్రభుత్వం సంతాప దినంగా ప్రకటించింది. ఈ క్రమంలో జాతీయ జెండాను సగం వరకు దించనున్నారు. ఎలాంటి వేడుకలు నిర్వహించడం జరగదు.
కేరళ, కర్ణాటకల్లో సెలవు
జయలలిత మృతి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఏడు రోజులపాటు సంతాప దినాలుగా, మూడు రోజులపాటు సెలవు దినాలుగా ప్రకటించింది. కాగా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కూడా మంగళవారంను సంతాప దినంగా ప్రకటించాయి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications