Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తమిళనాడులో 6న సెలవుదినం: కేంద్రం సంతాప దినం, కేరళ, కర్ణాటకలో కూడా

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జ్ఞాపకార్థంగా డిసెంబరు 6ను ప్రభుత్వ సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన జారీచేసింది. ఇక నుంచి ఏటా అన్ని ప్రభుత్వ, పురపాలక శాఖలకు ఈ సెలవు వర్తిస్తుంది.

పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, రోజువారీ వేతనాలు తీసుకునే అందరికీ జీతం చెల్లింపు(పెయిడ్‌ హాలిడే)గా ప్రకటించారు. 75 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సోమవారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Photos : జయలలిత కు నివాళి

ఆమె మృతితో తమిళనాడు రాష్ట్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమెను కడసారి చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దయెత్తున ప్రజలు చెన్నైకి తరలివస్తున్నారు.
ఆమె పార్థీవదేహాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళుర్పిస్తున్నారు.

Jaya to be accorded state funeral- Centre declares one day mourning

కేంద్రం సంతాప దినం

జయలలిత మృతి చెందిన నేపథ్యంలో మంగళవారం(డిసెంబర్)ను కేంద్ర ప్రభుత్వం సంతాప దినంగా ప్రకటించింది. ఈ క్రమంలో జాతీయ జెండాను సగం వరకు దించనున్నారు. ఎలాంటి వేడుకలు నిర్వహించడం జరగదు.

కేరళ, కర్ణాటకల్లో సెలవు

జయలలిత మృతి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఏడు రోజులపాటు సంతాప దినాలుగా, మూడు రోజులపాటు సెలవు దినాలుగా ప్రకటించింది. కాగా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కూడా మంగళవారంను సంతాప దినంగా ప్రకటించాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+