జయలలితకు కర్ణాటక ప్రభుత్వం షాక్: సుప్రీంలో అపీల్
బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత అక్రమాస్తుల కేసు తీర్పును సుప్రీం కోర్టులో అప్పీలు చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయనిపుణుల సలహా మేరకు కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో సోమవారం విధాన సౌధలో మంత్రివర్గ సమావేశం జరిగింది. సిద్దరామయ్య తన మంత్రి వర్గంతో పలు విషయాలు చర్చించారు. అదే సమయంలో ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాదించారని జయలలిత మీద నమోదు అయిన కేసు పరిణామాలపై కూడా చర్చ జరిగింది.
కర్ణాటక హై కోర్టు ఏకసభ్య బెంచ్ న్యాయమూర్తి సీ.ఆర్. కుమారస్వామి మే 11వ తేది జయలలిత అక్రమాస్తుల కేసు కొట్టి వేస్తు ఆ కేసులో ఉన్న అందరికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం చర్చకు వచ్చంది. జయలలిత కేసు సుప్రీం కోర్టులో అప్పీలు చెయ్యాలని న్యాయనిపుణులు ఇచ్చిన సలహాలను పరిశీలించారు.

స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీ.వి.ఆచార్య, అడ్వకేట్ జనరల్ రవివర్మ సైతం జయలలిత కేసు సుప్రీంలో అప్పీలు చెయ్యాలని ప్రభుత్వానికి సూచించారు. ఇదే సమయంలో మే 24వ తేదిన జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
బీబీఎంపీ ఎన్నికలు జరుగుతున్నందు వలన జయలలిత కేసును సుప్రీంలో అప్పీలు చేస్తే బెంగళూరులోని తమిళ సోదరులు తమ పార్టీకి ఓట్లు వెయ్యరని, అప్పీలు చెయ్యరాదని మంత్రులు, కాంగ్రెస్ శాసన సభ్యులు సిద్దరామయ్య మీద ఒత్తిడి తీసుకు వచ్చారు. అయితే చివరికి సుప్రీంలో అప్పీలు చెయ్యాలని నిర్ణయించారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications