జయలలిత మరణంతో.. ఒక్కరోజులోనే రూ.1500కోట్ల నష్టం
సీఎం జయలలిత మరణంతో.. తమిళనాట వాణిజ్య సముదాయాలన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం నాడు ఒక్కరోజే దాదాపు రూ.1500కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా.
చెన్నై: సీఎం జయలలిత మరణంతో తమిళనాట జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం పలు ప్రైవేటు రంగాలపై పడడంతో మంగళవారం ఒక్కనాడే తమిళనాడుకు దాదాపు 1500కోట్ల నష్టమేర వాటిల్లినట్టు సమాచారం.
సీఎం మరణానికి సంతాపంగా వాణిజ్య సముదాయాలు, పలు ఐటీ సంస్థలు స్వచ్చందంగా మూతపడ్డాయి. ఇందులో ఆటో మొబైల్, ఐటీ రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కారణం.. ప్రఖ్యాత ఆటోమొబైల్ కంపెనీల మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ అన్ని తమిళనాడులో ఉండడమే.

దాదాపుగా ప్రతీ ఏటా 3.50 లక్షలకు పైగా కమర్షియల్ వెహికల్స్, 14 లక్షల కార్లు మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్ నుంచే తయారవుతుంటాయి. అంటే, ప్రతి నిమిషానికి తమిళనాడులో మూడు కార్ల చొప్పున తయారవుతున్నాయి. మంగళవారం నాడు యూనిట్స్ అన్నింటిని మూసివేయడంతో ఆ నష్టం భారీగానే ఉంటుందని అంచనా.
ఇక ఐటీ రంగం విషయానికొస్తే.. తమిళనాడులో దాదాపుగా 600 ఐటీ కంపెనీలున్నాయి. ఇందులో 4లక్షల మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. రీటెయిల్ సంస్థలో మంగళవారం నాడు ఒక్కరోజే దాదాపు రూ.200కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందనేది అంచనా. ఇలా మొత్తం అన్ని రంగాలను కలుపుకుని చూస్తే.. ఈ నష్టం దాదాపు రూ.1500కోట్ల వరకు ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications