ఫైర్ బ్రాండ్ ఎంపీకి షాక్, సౌమ్య రెడ్డి దెబ్బతో కేసు, ఏం వీడియో పోస్టు చేశారంటే? టార్గెట్!
బెంగళూరు సౌత్ బీజేపీ అభ్యర్థి, ఆ నియోజక వర్గం సిట్టింగ్ ఎంపీ తేజస్వి సూర్య మతం ఆధారంగా ఓట్లు అడిగారని ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై బెంగళూరులోని జయనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యిందని చీఫ్ రిటర్నింగ్ అధికారి తెలిపారు. తేజస్వి సూర్య ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేసి మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించినందుకు కేసు నమోదైందని చీఫ్ రిటర్నింగ్ అధికారి తెలిపారు.
లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్బంగా ఓటర్లు వచ్చి తమ హక్కులు వినియోగించుకోవాలని బీజేపీ అభ్యర్థి తేజస్వి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ను సరిహద్దు భద్రత, ఆర్టికల్ 370తో పాటు రామమందిరాన్ని పేర్కొన్న చివరి వీడియోను విడుదల చేశారు. చివరి నాలుగు గంటల ఓటింగ్ను పూర్తిగా వినియోగించుకోవాలని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

అంతకుముందు బీజేపీ ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్కు రావడానికి తేజస్వి సూర్య 80%-20% పోలికలు ఇచ్చారు. మేం బీజేపీ ఓటర్లు 80 శాతం. కానీ కేవలం 20 శాతం మంది మాత్రమే బయటకు వచ్చి ఓటు వేశారని, కాంగ్రెస్ ఓటర్లు 20 శాతం అయితే బయటకు వచ్చి 80 శాతం ఓటేస్తున్నారు. చాలా పోలింగ్ బూత్లలో ఇదే వాస్తవం. మీరు ఓటు వేయకుంటే 20 శాతం మంది కాంగ్రెస్ ఓటర్లు కచ్చితంగా ఓటు వేస్తారని తేజస్వి సూర్య ఎక్స్ లో పోస్టు చేశారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి మత ప్రాతిపదికన ఓట్లు అడిగినందుకు గాను బెంగళూరు సౌత్ బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్యపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యా రెడ్డి డిమాండ్ చేశారు. తాను ఓడిపోతానని తేజస్వి సూర్యకు ముందే తెలుసు అని సౌమ్యా రెడ్డి ఆరోపించారు. తేజస్వి సూర్య ఓటు వేసిన తరువాత కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 30 సీట్లకు మించి గెలవదని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశకు లోనైంది. 30 సీట్ల కంటే ఎక్కువ గెలవదని పోల్ సర్వేలు చెబుతున్నాయి. అందుకే వారు ప్రధాని మోదీపై వ్యక్తిగత దాడులు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తేజస్వి సూర్య ఆరోపించారు. మతం ప్రతిపాదికన ఓటర్లను ఓటు వెయ్యాలని సోషల్ మీడియాలో పోస్టు చేసిన బెంగళూరు సౌత్ లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే సిట్టింగ్ ఎంపీ తేజస్వి సూర్య ఇంకా ఈ విషయంపై స్పందించలేదు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications