తెలుగు రాష్ట్రాలపై ఊరింపేనా?: జయప్రద యూ టర్న్
లక్నో: అలనాటి ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద యూ టర్న్ తీసుకోనున్నారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. జయప్రద తిరిగి సమాజ్ వాది పార్టీలో చేరే అవకాశాలు లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
శాసన మండలికి ఎన్నికయ్యేందుకు ఆమె సమాజ్ వాది పార్టీలో చేరవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో సమాజ్ వాది పార్టీలో ఉన్న జయప్రద... అమర్ సింగ్ వెంట కలిసి ఆ పార్టీని వీడారు. ఇప్పుడు ఆమె తిరిగి సమాజ్ వాది పార్టీలో చేరి, ఎమ్మెల్సీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

జయప్రద రాజకీయ రంగ ప్రవేశం తెలుగుదేశం పార్టీ ద్వారా జరిగింది. ఆ తర్వాత ఆమె ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్లారు. రాంపూర్ ఎంపీగా పని చేశారు.
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు పలుమార్లు తెలుగు రాష్ట్రాలకు వచ్చిన జయప్రద... తాను త్వరలో ఇక్కడకు వస్తానని ఊరించారు. దీంతో, సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఏపీ నుండి పోటీ చేసే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. రాజమండ్రి లోకసభ స్థానం తదితరాలు వినిపించాయి. కానీ ఆమె రాలేదు. ఇప్పుడు తిరిగి ఎస్పీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications