జేడీయూ మునిగిపోయే ఓడ: పార్టీకి ఆర్పీసీ సింగ్ రాజీనామా.
మాజీ కేంద్రమంత్రి, జేడీయూ నేత ఆర్పీ సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా బాట పట్టారు. పార్టీలో ఏమీ మిగలలేదు అని సింగ్ అన్నారు. ఇదీ ముమ్మాటికి మునిగిపోయే ఓడ అని చెప్పారు. సింగ్ ఆస్తులు పెరగడంతో షోకాజు నోటీసు జారీచేసింది. సమాధానం ఇవ్వాలని కోరింది. దీంతో ఆయన ఏకంగా పార్టీకే రాజీనామా చేశారు.
నలంద జిల్లా జనతదాళ్కు చెందిన ఇద్దరు సహచరుల నుంచి ఆధారాలతో కూడా ఫిర్యాదు చేసిందట. 2013 నుంచి 202 వరకు టఆస్తులు పెరిగాయని వారు పేర్కొన్నారు. నితీశ్ కుమార్ అవినీతి రహత పాలన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసమే చర్యలు తప్పడం లేదు.
ఆర్పీసీ సింగ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. 1990లో నితీశ్ కుమార్ వద్ద నమ్మకం గెలుచుకున్నాడు. రాజకీయాల్లో చేరేందుకు 2010లో వీఆర్ఎస్ తీసుకున్నాడు. తొలుత పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. గతేడాది నితీశ్ కుమార్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవీ నుంచి వైదొలిగారు. ఆ సమయంలో ఆర్పీ సింగ్ బాధ్యతలను చేపట్టారు. తర్వాత కేంద్ర క్యాబినెట్లో పదవీ కూడా పొందారు. ఆర్సీపీ సింగ్ ఇప్పటివరకు జేడీయూ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. నితీశ్ కుమార్కు ఆర్సీపీ సింగ్ అత్యంత సన్నిహితుడు.