జెట్ ఎయిర్వేస్కు తప్పిన ప్రమాదం: పక్షి తాకి, మంటలు వచ్చాయి
ఖాట్మాండు: నేపాల్లో జెట్ ఎయిర్ వేస్ విమానానికి సోమవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత పక్షి ఢీకొంది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. తిరిగి విమానాన్ని సురక్షితంగా దింపటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
ఆ విమానం ముంబై నుండి వెళ్లింది. విమానాశ్రయానికి చేరువ అయ్యే సమయంలో పక్షి ఢీకొంది. ప్రయాణీకులు అందరు కూడా సురక్షితంగా ఉన్నారని ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం (టీఐఏ)అధికారులు తెలిపారు. పక్షి తగలడం, మంటలు చెలరేగిన నేపథ్యంలో ఇంజనీర్లు విమానాన్ని పరిశీలిస్తున్నారు.

డామేజ్ అయిన ప్రాంతాన్ని సరి చేస్తున్నారని చెప్పారు. బోయింగ్ 737-800 విమానం ఉదయం 11.20 నిమిషాలకు ల్యాండ్ కావాల్సి ఉంది. పక్షి తగిలిన నేపథ్యంలో కొంత ఆలస్యం అయింది. కాగా, త్రిభువన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో పక్షులు విమానాలకు తగలడం అసాధారణ విషయమేమీ కాదని కూడా అంటున్నారు. గతంలోను ఇలా జరిగాయని చెబుతున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications