జియాఖాన్ మృతి కేసులో 'అమెరికా ఎఫ్బిఐ' ట్విస్ట్
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది. సిబిఐ దర్యాప్తు చేసిన ఈ కేసులో జియా ఆత్మహత్య చేసుకుందని పేర్కొనడంపై ఆమె తల్లి రబియా ఖాన్ బాంబే కోర్టులో తాజాగా పిటిషన్ వేశారు.
ఆమె హత్యకు గురైతే సిబిఐ ఆత్మహత్యకు గురైందని పేర్కొందని ఆమె పిటిషన్లో తెలిపారు. జియాఖాన్ అమెరికాలో పుట్టినందున ఈ కేసును ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి (ఎఫ్బిఐ)అప్పగించాలని ఆమె పిటిషన్లో విజ్ఞప్తి చేశారు.
కేసును ఇన్ని రోజులు వాయిదా వేసేందుకు సహకరించిన పోలీసుల పైనా చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును కోరారు. ఈ కేసులో సూరజ్ పంచోలీ హస్తం ఉందా? లేదా? అనేది తేల్చకుండా సిబిఐ కేసును మూసివేసిందని ఆరోపించారు.
నిజానికి పిటిషన్ వేసిన వారిని, అమెరికా కాన్సులేట్ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె అన్నారు. కాగా, ఈ పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుంది. జియాఖాన్ జూన్ 3, 2013లో తన ఇంటిలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే.