పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డులు చోరి
బెంగళూరు: ప్రముఖ జాతీయ కవి, రచయిత, అధ్యాపకుడు కువెంపు మ్యూజియంలో దొంగలు పడ్డారు. కువెంపునకు చెందిన పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డులతో పాటు విలువైన వస్తువులు చోరీ చేసి మాయం అయ్యారు.
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్ళి తాలుకా కుప్పళిలో కువెంపు జన్మించిన కవిశైల భవనంలోనే సోమవారం అర్దరాత్రి దాటిన తరువాత ఈ చోరీ జరిగింది. కుప్పళి వెంకటప్పగౌడ పుట్టప్ప తన రచనలు, కవితలను కువెంపు అనే పేరుతో వ్రాసేవారు.
కువెంపు జాతీయ కవిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కర్ణాటక రాష్ట్ర గీతం అయిన ‘జయ భారత జననియ తనుజితే' అనే పాటను ఆయనే వ్రాశారు. కువెంపు రచనలను గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డులతో ఆయనను సత్కరించింది.

కువెంపు మరణించిన తరువాత ఆయన పుట్టి పెరిగిన ఇంటిని మ్యూజియంగా తీర్చిదిద్దారు. ఇక్కడే ఆయన అవార్డులు, ఆయన రచించిన పుస్తకాలు, రచనలు, ఆయనకు సంబంధించిన విలువైన వస్తువులు భద్రపరిచారు.
ఈ భవనం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సోమవారం అర్దరాత్రి దాటిన తరువాత దుండగులు సీసీ కెమెరాల వైర్లు కత్తిరించారు. గుట్టు చప్పుడు కాకుండా తలుపులు పగలగొట్టి విలువైన అవార్డులు ఎత్తుకుని వెళ్లారు.
మంగళవారం విషయం గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కువెంపు మ్యూజియం గుర్తించి అణువణువూ తెలిసిన వారే సీసీ కెమెరాలు పని చెయ్యకుండా చేసి చోరీ చేశారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications