ఉమర్ ఖలీద్కు బెయిల్ మంజూరు -ఢిల్లీ అల్లర్ల కేసులో జేఎన్యూ మాజీ నేతకు ఊరట
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) విద్యార్థి సంఘం మాజీ నేత ఉమర్ ఖలీద్కు బెయిల్ మంజూరైంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ గతేడాది ఢిల్లీలో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులో అరెస్టైన ఉమర్ ఖలీద్.. 200రోజులుపైగా జైలులోనే ఉన్నారు. పలు ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు ఢిల్లీ కోర్టు గురువారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ సహా దేశమంతటా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోన్న కారణంగా జైలు నుంచి విడుదలైన అనంతరమే ఫోన్లో ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఖలీద్ కు కోర్టు షరతు విధించింది. ఈ కేసులో ఇతర నిందితులను అరెస్ట్ చేసేవరకు ఉమర్ ను జైల్లోనే ఉంచాలన్న ఢిల్లీ పోలీసుల వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇతర నిందితులు అరెస్టయ్యేదాకా అతణ్ని జైలులో మగ్గిపోయేలా చేయకూడదని బెయిల్ మంజూరు చేసే సమయంలో కోర్టు పేర్కొంది.

సీఏఏ నిరసనలు హింసాత్మక మలుపు తీసుకోవడం, గతేడాది ఫిబ్రవరి 24న ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. కాగా, ఈ అల్లర్లు జరగడంలో ఉమర్ ఖలీద్ హస్తం ఉందనే కారణంతో అక్టోబర్లో అతడిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసు క్రైం బ్యూరో నమోదు చేసిన చార్జ్షీట్లో ఉమర్ ఖలీద్ను నిందితుడిగా చేర్చారు. అనంతరం అతడిపై ఉపా చట్టం ప్రకారం కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఢిల్లీలో జరిగిన ఈ అల్లర్లలో 50 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications