ఆటలొద్దు.. కమల్ హాసన్ సంచలన వార్నింగ్..
తమిళనాడులో మళ్లీ భాషా రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా జాతీయ విద్యా విధానం(NEP) దేశవ్యాప్తంగా అమలుపై తమిళనాడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో తమిళ ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించి 8 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో చెన్నైలోని పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ మేరకు ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు.
"తమిళీయులు భాష కోసం ప్రాణాలు అర్పించారు. తమిళ భాషతో ఆటలు వద్దు. నేను రాజకీయాల్లోకి ఆలస్యంగా ప్రవేశించాను. అందుకే ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంది. 20 ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి ప్రవేశించి ఉంటే ఇప్పుడు నా స్థానం, లెవెల్ వేరేగా ఉండేది. తమిళనాడులో పిల్లలకు కూడా తెలుసు వాళ్లు ఏ భాష ఎంచుకోవాలో. వారికి ఆ పరిపక్వత ఉంది."అని కమల్ హాసన్ తెలిపారు.

ప్రత్యర్థులు తనను ఫెయిల్డ్ పొలిటిషియన్ అని అంటారు.. కానీ అవన్నీ తాను పట్టించుకోనున్నారు. ఈమేరకు 2026 అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ కార్యకర్తలు దృష్టి పెట్టాలన్నారు. తమ పార్టీ చిన్నదని.. ఈ సంవత్సరం తమ గొంతును పార్లమెంట్ లో వినిపిస్తామని అన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీలో తమ గొంతును వినిపిస్తామన్నారు. 2026 ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications