coronavirus: కనిక కపూర్ ఏజ్ 28 ఏళ్లు అట.. 13 ఏళ్లు తగ్గించిన అధికారులు, మేల్ అట..?
కనిక కపూర్కు కరోనా వైరస్ సోకిందనే అంశంపై వివాదం నెలకొంది. ఇటీవల లండన్ నుంచి కనిక కపూర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే పార్టీకి వెళ్లడంతో బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సహా ఇతర నేతలు సెల్ప్ క్వారంటైన్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే కనిక కపూర్ను వెనకొసుకొచ్చిన సోనమ్ కపూర్ను నెటిజన్లు ఏకీపారేశారు. దీంతో కనిక కపూర్ కుటుంబసభ్యులు స్పందించారు.
ఈ నెల 9వ తేదీన కనిక కపూర్ లండన్ నుంచి ముంబై వచ్చారని పేర్కొన్నారు. రెండురోజుల తర్వాత లక్నో వచ్చారని.. తర్వాత కరోనా పాజిటివ్ వచ్చిందని బయటపడిందని అంగీకరించారు. కానీ కనిక కపూర్ నివేదికపైనే ఫ్యామిలీ మెంబర్స్ అనుమానం వ్యక్తం చేశారు. వైద్యులు చెబుతోన్న నివేదిక కనికదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ కుటుంబసభ్యుల సందేహానికి కూడా కారణం ఉంది.

కనిక కపూర్కు కరోనా పాజిటివ్ వచ్చిందనే రిపోర్టులో తప్పులతో వారికి అనుమానం వచ్చింది. కనిక కపూర్ రక్త నమూనాలను తీసుకున్న వైద్యులు... ఆమె వయస్సును తప్పుగా రాశారు. 41 ఏళ్లు ఉన్న ఆమె ఏజ్ కేవలం 28 ఏళ్లుగా చూపించారు. దీంతోపాటు ఆమె లింగాన్నే మార్చారు. ఫిమేల్ చూపించాల్సింది... మేల్ అని రాశారు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్.. నివేదిక ఎవరిదీ, కనికదేనా..? మరేవరిదైనా ఇచ్చారా అని అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యుల ఆరోపణలపై వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించాల్సి ఉంది.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications