Congress Mukth Bharat: సోషల్ మీడియాలో కాంగ్రెస్ ను ఫుట్ బాల్ ఆడుకుంటున్న బీజేపీ !
బెంగళూరు/ లక్నో: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంచి జోష్ మీద ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షాలను చిత్తుచిత్తుగా ఓడించిన బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ను లక్షంగా చేసుకున్న బీజేపీ కార్యకర్తలు బహిరంగ ప్రదేశాల్లోనే సంబరాలు జరుపుకుంటున్నారు. భారతదేశానికి పట్టిన పీడ పోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండకూడదని గతంలో కొందరు బీజేపీ నాయకులు విమర్శించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కూడా బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టడం లేదు. చచ్చిన పామును మరింత చంపుతున్నారు అనే సామెతలాగా బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ అనే హ్యాష్ ట్యాగ్ తో బీజేపీ నాయకులు ఆ పార్టీ నాయకుల విజయం గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. భారతదేశం అభివృద్ది, భారతదేశం సంస్కృతి విషయంలో భారతీయులు అందరూ ఏకతాటిపైకి వస్తున్నారని బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో ట్విట్లు చేస్తున్నారు. భారతీయులు ఇప్పుడు మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్దిని కోరుకుంటున్నారని మరోసారి నిరూపించారని బీజేపీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ కావాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు.
Comedy kings: నిన్న కామెడీ కింగ్స్, నేడు రియల్ హీరోలు, ఉక్రెయిన్ జెలెన్ స్కీ, పంజాబ్ మాన్ లెక్క!
పంచతంత్రం దెబ్బ
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంచి జోష్ మీద ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షాలను చిత్తుచిత్తుగా ఓడించిన బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ను లక్షంగా చేసుకున్న బీజేపీ కార్యకర్తలు బహిరంగ ప్రదేశాల్లోనే సంబరాలు జరుపుకుంటున్నారు.
చచ్చిన పామును ఇంకా చంపుతున్నారు
భారతదేశానికి పట్టిన పీడ పోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండకూడదని గతంలో కొందరు బీజేపీ నాయకులు విమర్శించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కూడా బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టడం లేదు. చచ్చిన పామును మరింత చంపుతున్నారు అనే సామెతలాగా బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకున్నారు.
బీజేపీ ప్రభుత్వం
కాంగ్రెస్ ముక్త భారత్ అనే హ్యాష్ ట్యాగ్ తో కర్ణాటక బీజేపీ నాయకులు ఆ పార్టీ నాయకుల విజయం గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. భారతదేశంలో బీజేపీ ఉంటేనే ప్రజలు సురక్షితంగా ఉంటారని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని మరోసారి రుజువు అయ్యిందని కర్ణాటక బీజేపీ నాయకులు అంటున్నారు.
కాంగ్రెస్ ముక్త భారత్ హ్యాష్ ట్యాగ్
భారతదేశం అభివృద్ది, భారతదేశం సంస్కృతి విషయంలో భారతీయులు అందరూ ఏకతాటిపైకి వస్తున్నారని బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో ట్విట్లు చేస్తున్నారు. భారతీయులు ఇప్పుడు మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్దిని కోరుకుంటున్నారని మరోసారి నిరూపించారని బీజేపీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్ అనే హ్యాష్ ట్యాగ్ తో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దుమ్మెత్తిపోస్తున్న బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీని చెడుగుడు ఆడుకుంటున్నారు.