Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డీకేకి అండగా సీఎం, మంత్రివర్గం, సీబీఐకి షాక్, ఢిల్లీ మాట ఏమిటో ?, అక్రమాస్తుల కేసులో ట్విస్ట్ !

బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై అక్రమ ఆస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తును ఉపసంహరించుకోవాలని ఆ రాష్ట్ర హోమ్ శాఖ సమర్పించిన ప్రతిపాదనకు కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన విధానసౌదలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

గత బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం డీకే శివకుమార్‌పై కేసును సీబీఐకి అప్పగించింది. ఈ ప్రతిపాదనకు అప్పటి కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ విషయంపై ప్రస్తుత కర్ణాటక మంత్రి హెచ్‌కే పాటిల్ మాట్లాడుతూ డీకే శివకుమార్ కేసును సీబీఐకి అప్పగిస్తూ గత బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టం ప్రకారం లేదని అన్నారు. దర్యాప్తును సీబీఐకి అప్పగించే ముందు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ నుంచి బీజేపీ అనుమతి తీసుకోలేదని మంత్రి హెచ్‌కే పాటిల్ అన్నారు.

Karnataka Cabinet approves withdrawal of DK Shivakumars illegal assets case from CBI

సీబీఐ దర్యాప్తును ఉపసంహరించుకోవడమే కాకుండా రాష్ట్ర పోలీసు శాఖకు దర్యాప్తును అప్పగించాలని కూడా ప్రతిపాదనలో కోరామని మంత్రి హెచ్ కే పాటిల్ అన్నారు. అడ్వకేట్ జనరల్ శశికిరణ్ శెట్టి అభిప్రాయం మేరకు ఈ ప్రతిపాదనను సమర్పించామని మంత్రి వివరించారు. కర్ణాటకలో 577 అక్రమ ఆస్తుల కేసులు నమోదయ్యాయని, అయితే ఏ ఒక్కటీ సీబీఐకి అప్పగించలేదని డీకే శివకుమార్ కార్యాలయం ఇప్పటికే తెలిపింది.

Karnataka Cabinet approves withdrawal of DK Shivakumars illegal assets case from CBI

ఇలాంటి కేసులన్నింటినీ రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ), అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) లేదా లోకాయుక్త విచారించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. గత కర్ణాటక బీజేపీ ప్రభుత్వం డీకే శివకుమార్ కేసును మాత్రమే సీబీఐకి బదిలీ చేసిందని డీసీఎం డీకే శివకుమార్ కార్యాలయం తెలిపింది. డీకే శివకుమార్ కార్యాలయం తెలిపిన ప్రకారం కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొన్నారు, అయితే బీజేపీ ప్రభుత్వం అతని కేసును లోకాయుక్తకు బదిలీ చేసిందని డీకే శివకుమార్ కార్యాలయానికి చెందిన సిబ్బంది అంటున్నారు.

Karnataka Cabinet approves withdrawal of DK Shivakumars illegal assets case from CBI

2018లో డీకే శివకుమార్‌పై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా 2019లో అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కేసును కేంద్ర దర్యాప్తునకు అప్పగించేందుకు అనుమతి ఇచ్చారు. గత బీజేపీ నేతృత్వంలోని యడ్యూరప్ప ప్రభుత్వం ఉత్తర్వును రద్దు చేయాలని డీకే శివకుమార్ గతంలో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు, అయితే కోర్టు ఈ ఏడాది ఏప్రిల్‌లో అతని పిటిషన్‌ను కొట్టివేసింది. సీబీఐ దర్యాప్తు దాదాపు ముగిసిందని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. మొత్తం మీద కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసు మళ్లీ రాజకీయ రంగు పులుముకోవడం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+