కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
కర్ణాటక ప్రజల ఆగ్రహానికి కారణమైన హుబ్బళిలోని కాలేజ్ అమ్మాయి నేహా హిరేమఠ్ హత్య కేసుకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సీఎం సిద్ధరామయ్య చివరికి రంగంలోకి దిగారు. గురువారం హుబ్బళిలోని నేహా నివాసానికి వెళ్లిన సీఎం సిద్దరామయ్య ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్, నేహా తండ్రి నిరంజన్ హీరేమఠ్ కుటుంబానికి సానుభూతి తెలిపిన సీఎం సిద్దరామయ్య బీజేపీ ఆరోపణలకు సమాధానం ఇచ్చారు.
నేహా హత్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని సీఎం సిద్దరామయ్య మీడియాకు చెప్పారు. హుబ్బళిలో సీఎం సిద్ధరామయ్య హత్యకు గురైన నేహా ఇంటికి వెళ్లి ఆమె తండ్రి నిరంజన్ హిరేమఠ్, ఆమె కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడి ఓదార్చారు. అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ నేహా హిరేమఠ్ హత్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, నేహా హత్య కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశామని అన్నారు.

నేహా హత్య కేసులో జైల్లో ఉన్న ఫయాజ్ గురించి పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారని సిద్దరామయ్య అన్నారు. నేహా హత్య కేసు దర్యాప్తు సీఐడీకి అప్పగించామని సిద్దరామయ్య అన్నారు. హంతకుడు ఫయాజ్ ను కఠినంగా శిక్షించాలని. ఈ కేసులో బీజేపీ రాజకీయం చేస్తోందని, తన హయాంలో ఒక్క కేసు కూడా సీబీఐకి అప్పగించలేదని బీజేపీ నాయకులు గుర్తు చేసుకోవాలని సీఎం సిద్దరామయ్య అన్నారు.
నేహా హత్య కేసులో రాజకీయాలు చేయడం నాకు ఇష్టం లేదని, కాంగ్రెస్ రాజకీయాలు చేయలేదని సిద్దరామయ్య అన్నారు. నేహా కుటుంబం చాలా విషాదంలో ఉందని, వారిని ఓదార్చి ధైర్యం చెబుదామని ఇక్కడికి వచ్చామని, నిరంజన్ హిరేమఠ్ కుటుంబానికి తోడుగా ఉంటామని వారికి మేము అభయం ఇచ్చామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. నేహా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, నింరంజన్ హిరేమఠ్ కుటుంబానికి తగిన రక్షణ కల్పిస్తామని, ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా? తదితర కోణాల్లోనూ దర్యాప్తు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని సీఎం సిద్దరామయ్య అన్నారు.
-
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications