దెబ్బకు లోపలేసిన సీఐడీ, టెర్మినల్ స్కామ్ కేసులో కలకలం, మాజీ ఎండీని పట్టుకుని ?
రూ. 47.10 కోట్ల కుంభకోణానికి సంబంధించి డి. దేవరాజ అరసు ట్రక్ టెర్మినల్ (డీడీయుటీటీఎల్) మాజీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఎస్. శంకరప్పను కర్ణాటక సీఐడీ అరెస్టు చేసింది. డీడీయూటీఎల్ కార్పొరేషన్లో 2021 నుంచి 2023 మధ్య కాలంలో కాంట్రాక్టుల మంజూరులో అవకతవకలు జరిగాయని కార్పొరేషన్ ప్రస్తుత ఎండీ సీఎన్ శివప్రకాష్ బెంగళూరులోని విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ కేసును తరువాత సీఐడీ విచారించింది. అదేవిధంగా విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు మాజీ ఎండీ శంకరప్పను అదుపులోకి తీసుకున్నారు.ప్రసుత్త స్టేట్ న్యూస్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ప్రమోషన్ బ్రాంచ్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న శంకరప్ప గతంలో డీడీయుటీఎల్ ఎండీగా పని చేశారు. కార్పొరేషన్ కాంట్రాక్టు పనుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు విచారణలో ఆధారాలు లభించాయని సీఐడీ వర్గాలు తెలిపాయి.

2021అక్టోబర్ 25వ తేదీ డి. దేవరాజు అరసు ట్రక్ టెర్మినల్లో జరిగిన 194వ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో, ట్రక్ టెర్మినల్స్ మరమ్మతులు మరియు నిర్వహణ కోసం రూ.10 కోట్ల వరకు పీస్మీల్ కాంట్రాక్టులు ఇవ్వాలని ఆమోదం నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ తర్వాత పనులు చేపట్టకుండా నకిలీ పత్రాలు సృష్టించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో ఈ వ్యవహారం కలకలం రేపింది.
దీనిపై ఆరా తీసిన కార్పొరేషన్ ఎండీ ఆ తర్వాత బెంగళూరులోని విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. ముక్కోణపు కాంట్రాక్టు పనుల్లో రూ. 47.10 కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం సీఐడీని ఆదేశించింది. ఈ కేసు క్షుణ్ణంగా విచారణ చేసిన సీఐడీ అధికారులు డీడీయుటీటీఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ శంకరప్ప అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయన్ను అరెస్టు చెయ్యడం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications