అబ్బే అదేం లేదు.. నాయకత్వ మార్పుపై యడియూరప్ప.. ఎమ్మెల్యేల భేటీపై సర్వత్రా ఆసక్తి
కర్ణాటకలో నాయకత్వ మార్పు ఖాయమని.. యడియూరప్పను సీఎం పదవీ నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ రూమర్లపై యడియూరప్ప స్పందించారు. అబ్బే అలాంటిదేమీ లేదని స్పష్టంచేశారు. తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని.. పూర్తి కాలం పదవీలో ఉంటానని తేల్చిచెప్పారు. ఎందుకు సందేహా పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.
Recommended Video

లభించని మోక్షం..
కర్ణాటక మంత్రివర్గ విస్తరణకు మోక్షం లభించడం లేదు. ఈ క్రమంలోనే జనవరి మొదటి వారంలోనే బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని యడియూరప్ప సోమవారమే మీడియాకు చెప్పారు. జనవరి 4 నుంచి రెండురోజుల జరిగే సమావేశంలో అజెండా ఏమిటి అన్నది తెలియరాలేదు. జనవరి 15వ తేదీ నుంచి రెండురోజులపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

భేటీపై సర్వత్రా ఆసక్తి..
జనవరిలో జరిగే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకే ఎమ్మెల్యేల సమావేశం జరుగనుందని బీజేపీ వర్గాలు పైకి చెబుతున్నాయి. కానీ అసలు అజెండా వేరే ఉందనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. బీజేపీ ఎమ్మెల్యేల మధ్య రగులుతున్న అసంతృప్తి, నియోజకవర్గ సమస్యలు, నిధుల విడుదలపై ఎమ్మెల్యేలను కూల్ చేసేందుకు యడియూరప్ప రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

సంకేతాలు ఇచ్చినా..
నాయకత్వ మార్పు విషయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి అరుణ్ సింగ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన తర్వాత కూడా పార్టీ అసమ్మతి నేత బసవనగౌడ పాటిల్ యత్నాళ్ కొత్త కథనాలను తెరపైకి తీసుకొచ్చారు. యత్నాళ్ వ్యాఖ్యలను హై కమాండ్ పెద్దలు ఖండించలేదు. దీంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేల సమావేశంలో యడియూరప్ప అనుసరించబోయే వ్యూహం ఎలా ఉంటుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

ఇదీ విషయం..
కర్ణాటకలో ఐటీ పార్కుల కోసం కేటాయించిన 4 ఎకరాలకు పైగా భూమిని డీ నోటిఫై చేసి.. గృహ నిర్మాణ అవసరాలకు మళ్లించడం ద్వారా యడియూరప్ప అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు జరపాలని 2013లో లోకాయుక్త ప్రత్యేక కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. అయితే దానిని కొట్టి వేయాలని సీఎం యడ్యూరప్ప హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. రెండు రోజుల క్రితం కొట్టివేసింది. భూమి కేటాయింపుపై యడియూరప్ప నిర్ణయంపై దర్యాప్తు జరగాల్సిందేనని.. అది పకడ్బందీగా జరిగేలా లోకాయుక్త కోర్టు పర్యవేక్షించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. యడియూరప్ప ఎంతకాలం పదవీలో ఉంటారనే అంశం చర్చనీయాంశమైంది.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications