కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, టైమ్స్ నౌ, వీఎంఆర్, జైన్ యూనివర్శిటీ సర్వే, నో మ్యాజిక్ ఫిగర్!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ప్రస్తుతం సర్వేల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎప్పుడు ఏ సంస్థ సర్వే విడుదల అవుతుందో, ఆ సర్వేలో ఏ పార్టీకి ఎన్ని మెజారిటీ సీట్లు వస్తాయని వెల్లడిస్తారో అంటూ రాజకీయ నాయకులతో పాటు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం టైమ్స్ నౌ, వీఎంఆర్, జైన్ యూనివర్శిటీల సర్వేలు విడుదలైనాయి.

సర్వేల్లో వ్యత్యాసం
సీ ఫోర్ సంస్థ సర్వే ఇటీవల విడుదలైయ్యింది. ఆ సర్వేలో కాంగ్రెస్ కే ఎక్కువ సీట్లు వస్తాయని వెలుగుచూసింది. సీఫోరో సంస్థ 2017, 2018లో విడుదల చేసిన మూడు సర్వేలల్లో ఎక్కు వ్యత్యాసం కనపడలేదు. ప్రస్తుతం సర్వేల మీదనే రాజకీయ నాయకులు పలు అంచనాలు వేస్తున్నారు.

టైమ్స్ నౌ సర్వే
సోమవారం రాత్రి టైమ్స్ నౌ, వీఎంఆర్, జైన్ విశ్వ విద్యాలయంల సర్వేలు విడుదల చేశారు. కర్ణాటకలోని వివిధ జిల్లాల్లోని శాసన సభ నియోజక వర్గాల్లో నిర్వహించిన సర్వేల ప్రకారం ఈ శాసన సభ ఎన్నికల్లో కర్ణాటకలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాదని వెలుగు చూసింది.

నో మ్యాజిక్ ఫిగర్
కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలల్లో ఎవరు అధికారంలోకి రావాలన్నా మ్యాజిక్ ఫిగర్ 113 అవసరం. అయితే టైమ్స్ నౌ, వీఎంఆర్, జైన్ విశ్వ విద్యాలయంలు నిర్వహించిన సర్వేలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాదని వెలుగు చూసింది.

టౌమ్స్ నౌ మూడు సర్వేల సరాసరి ఫలితాలు.
కాంగ్రెస్ - 93
బీజేపీ - 87
జేడీఎస్ - 38
ఇతరులు - 6

టైమ్స్ నౌ, వీఎంఆర్ సర్వే ఫలితాలు. (ఏప్రిల్ 23, 2018)
కాంగ్రెస్ - 91
బీజేపీ - 89
జేడీఎస్-బీఎస్పీ - 40
ఇతరులు - 4

జైన్ విశ్వ విద్యాలయం, సీఎన్ డీఎస్ సర్వే ఫలితాలు (ఏప్రిల్ 23,2018).
కాంగ్రెస్ -88
బీజేపీ - 92
జేడీఎస్, బీఎస్పీ - 35
ఇతరులు -9












Click it and Unblock the Notifications