న్యూస్ఎక్స్-సీఎన్ఎక్స్: కర్నాటకలో బీజేపీదే గెలుపు, కాంగ్రెస్కు భారీ షాక్
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు శనివారం సాయంత్రం ముగిశాయి. ఎగ్జిట్ పోల్ సర్వేలు విడుదలయ్యాయి. న్యూస్ఎక్స్ -సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 106, కాంగ్రెస్కు 75, జేడీఎస్కు 37, ఇతరులకు 1 సీటు వస్తాయని వెల్లడైంది.
న్యూస్ఎక్స్ -సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందంటే..
కాంగ్రెస్
పార్టీ
-
75
భారతీయ
జనతా
పార్టీ
-106
జేడీఎస్
-37
ఇతరులు
-
1
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొన్న విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కర్నాటకలో హంగ్ వస్తుందని ఎక్కువ వరకు ప్రీపోల్ సర్వేలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో కర్నాటక ఓటర్లు ఎవరికి పట్టం కడతారు? హంగ్ వస్తుందా? లేక ఏ పార్టీకైనా ప్రజలు ఏకపక్ష తీర్పును ఇస్తారా? అనేది ఆసక్తిని రేపుతోంది. ఫలితాల కోసం మే 15వ వరకు వేచి చూడాలి. ఓటింగ్ అనంతరం వచ్చే ఎగ్జిట్ ఫోల్ ఫలితాలను బట్టి అంచనా వేసుకోవచ్చు.