రాజకీయం అంటే ఇదే, రూ. 150 కోట్లు బూడిద, అధికార పార్టీ క్లారిటీతో, లీక్ !
బెంగళూరు/తుమకూరు: కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మాకు మేమే గొప్ప అంటూ మంత్రులు ప్రవర్థిస్తున్నారని గుసగుసలు వినపడుతున్నాయి. వర్గ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు అని కొత్తగా చెప్పనవసరం లేదు.
ఇప్పుడు కర్ణాటకలో మరోసారి ఇలాంటి రాజకీయాలు వెలుగు చూస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ వ్యాపారాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. గత నెలన్నర వ్యవధిలో వివిధ కేసుల్లో రూ. 150 కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని, ఆ డ్రగ్స్ మొత్తం కాల్చి బూడిద చేశామని కర్ణాటక హోమ్ శాఖా మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు.

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని కొరటగెరెలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ దందాను అరికట్టాలని నిర్ణయించుకున్నామని అన్నారు. గత నెలన్నర కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో కర్ణాటక రాష్ట్ర పోలీసులు రూ.150 కోట్లకు పైగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని తగులబెట్టారని అన్నారు.
తొలినాళ్లలో గ్రామాల్లో టమాటా మొక్కల మధ్య గంజాయిని పెంచేవారని, తర్వాత పలు పంటల్లో గంజాయి పెంచడం మొదలుపెట్టడం దురదృష్టకరం అని కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ విచారం వ్యక్తం చేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు మొక్కల రూపంలో పెరుగుతున్నాయని, వాటిని పూర్తిగా అడ్డుకుంటామని హోమ్ మంత్రి పరమేశ్వర్ అన్నారు.
కానీ ఇప్పుడు గంజాయి తక్కువ కావడంతో డ్రగ్స్ తో తయారు చేసిన మాత్రలు వేసుకుంటున్నారని వెలుగు చూసిందని, గంజాయి, డ్రగ్స్, కొకైన్, చరస్, హెరాయిన్తో సహా వివిధ రకాల డ్రగ్స్ తీసుకోవడం నేరుగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని కర్ణాటక హోమ్ మంత్రి పరమేశ్వర్ అన్నారు. దీంతో డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటున్నాయని, త్వరలో కర్ణాటకలో ఎక్కడా డ్రగ్స్ కనపడకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని కర్ణాటక హోమ్ శాఖా మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications