జనవరి 1 నుంచి స్కూల్స్ రీఓపెనింగ్ -స్ట్రెయిన్ వైరస్‌పై ప్రచారాలు నమ్మొద్దన్న విద్యా మంత్రి

కరోనా మహమ్మారిని డీల్ చేసే విషయంలో తొలి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తోన్న కర్ణాటక ప్రభుత్వం స్కూళ్ల రీఓపెనింగ్ అంశంలోనూ అదే తీరును ప్రదర్శిస్తోంది. కర్ణాటకలో కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా మూతపడిన బడులు కొత్త సంవత్సరం నాడు తెరుచుకోనున్నాయి.

కర్ణాటకలో ప్రభుత్వ పాఠశాలల పున:ప్రారంభం తేదీని స్వయంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఎస్ సురేష్ కుమార్ సోమవారం వెల్లడించారు. జనవరి 1 నుంచి ముందుగా 10వ తరగతి నుంచి 12వ తరగతుల వారికి ఫిజికల్ గా క్లాసులను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. అయితే..

Karnataka govt schools to reopen for classes 10, 12 from January 1

బడులు తెరిచినంత మాత్రాన విద్యార్థులు అందరూ విధిగా హాజరు కావాలన్న నిబంధన ఏదీ విధించలేదని, క్లాస్ రూమ్ కు రావాలా, లేదా అన్నది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఇష్టమని, ఒకవేళ విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు మొగ్గు చూపినా తమకు అభ్యంతరం లేదన్నారు. అలాంటి వారు ఇంటి నుంచే చదువుకోవచ్చని మంత్రి సురేశ్ చెప్పారు.

ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం జనవరి 1 నుంచి బడులు తెరుస్తున్నామని, స్కూళ్లకు రావాలా, వద్దా అనేది విద్యార్థుల ఇష్టమని మంత్రి వ్యాఖ్యానించారు. కాగా, స్కూళ్ల రీఓపెన్‌కు కొత్త రకం కరోనా (స్ట్రెయిన్ వైరస్‌)ను ముడిపెడుతూ కొన్ని దుష్ప్రచారాలు జరుగుతున్నాయని, వాటిని జనం నమ్మరాదని మంత్రి సురేశ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+