జేపీ నడ్డా కేసు రద్దు చేసిన హైకోర్టు, రెడ్డి బ్రదర్ కోసం వెళితే కేసు పెట్టిన ఈసీ !
బెంగళూరు/న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై దాఖలైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసును కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విజయనగరం జిల్లా హరప్పనహళ్లిలో నిర్వహించిన బహిరంగ ప్రచారంలో ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ప్రసంగం చేశారన్న ఆరోపణల నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా విముక్తి పొందారు.
తనపై హరప్పనహళ్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును రద్దు చేయాలని, ధారవాడ హైకోర్టు బెంచ్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జేపీ నడ్డా పిటిషన్ను అనుమతించిన హైకోర్టు ఆయనపై నమోదు అయిన కేసును రద్దు చేయాలని ఆదేశించింది.

జేపీ నడ్డా తరఫు సీనియర్ న్యాయవాది వాదిస్తూ నడ్డా తన ప్రసంగం ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టి, బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఫిర్యాదుదారుడి వద్ద దానిని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని, నడ్డా ప్రసంగం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని హైకోర్టులో వాదించారు.
అలాగే కేసుకు సంబంధించి మేజిస్ట్రేట్ నుండి అనుమతి పొందేటప్పుడు చట్టపరమైన నిబంధనలను పాటించలేదని, కేసును అడ్మిట్ చేయడంలో ట్రయల్ కోర్టు చర్య లోపభూయిష్టంగా ఉందని నడ్డా తరపు న్యాయవాది కర్ణాటక హైకోర్టులో వాదించారు. దీన్ని అంగీకరించిన హైకోర్టు కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మే 7వ తేదీన విజయనగరం జిల్లా హరప్పనహళ్లి పట్టణంలోని ఐ.బీ సర్కిల్ సమీపంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన జేపీ నడ్డా కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తే మీ రాష్ట్రంలో కేంద్రం పథకాలన్నీ కొనసాగుతాయని, ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఓటర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలు అందకుండా పోతాయని అన్నారని ఆరోపణలు ఉన్నాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వంటి అనేక పథకాలు నిలిచిపోతాయని, అభివృద్ధి కావాలంటే కర్ణాటకలో మరోసారి బీజేపీని గెలిపించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా అన్నారు. ఈ విషయమై ఎన్నికల అధికారులు హరప్పనహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ జేపీ నడ్డా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కర్ణాటక హైకోర్టు కేసును కొట్టివేయడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ, నడ్డా ఊపిరిపీల్చుకున్నారు. తన మీద తప్పుడు కేసు పెట్టారని అప్పట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొందరి మీద ఆరోపణలు చేశారు.
-
శివరాత్రి రోజు మటన్ తిన్నా.. శుభ ముహూర్తాలను నమ్మను: సీఎం సంచలనం -
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
ఉద్యోగుల బకాయిల విడుదలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, డెడ్ లైన్..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..










Click it and Unblock the Notifications