అమ్మాయిలతో?, హైకోర్టులో స్వామీజీకి ఎదురు దెబ్బ, అసలు ఏం జరిగిందంటే?, కేసుల్లో!
అత్యాచారం వంటి తీవ్రమైన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని చిత్రదుర్గ స్వామీజీ డాక్టర్ శివమూర్తి మురుగ స్వామీజీకి న్యాయ పోరాటంలో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. స్వామీజీపై ఉన్న అత్యాచారం, పోక్సో అభియోగాలను కొట్టివేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. ఇప్పుడు స్వామీజీ ఆ రెండు ఆరోపణలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
చట్టంలోని వివిధ సెక్షన్ల కింద స్వామీజీపై అభియోగాలు మోపుతూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. అయితే తాజా అభియోగాన్ని నమోదు చేసి విచారణ కొనసాగించాలని ట్రయల్ కోర్టును కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. డాక్టర్ శివమూర్తి మురుగ శరణ స్వామీజీ పిటిషన్లను దాఖలు చేశారు. నాగప్రసన్న నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ తీర్పునిచ్చింది.

ప్రాసిక్యూషన్ కేసు ఆధారంగా అభియోగాలను రూపొందించడంలో ప్రత్యేక న్యాయస్థానం కేవలం పోస్టాఫీసులా వ్యవహరించకూడదు. మత సంస్థల దుర్వినియోగ నిరోధక చట్టంలోని సెక్షన్లను పరిశీలించాలని హైకోర్టు చెప్పింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అమ్మాయిలపై అఘాయిత్యాల నిరోధక చట్టం, జువెనైల్ జస్టిస్ చట్టం కేసులో రెండో నిందితుడు బసవశ్రీకి వర్తింపజేశారు. మురుగ శ్రీపై తప్పుడు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేశారని స్వామీజీ న్యాయవాదులు అంటున్నారు.
మురుగ శరణ స్వామీజీ తమ మీద లైంగిక దాడి చేశారని ఇద్దరు అమ్మాయిలు మైసూరులోని నజరాబాద్ పోలీస్ స్టేషన్ లో 2022 సెప్టెంబర్ 26వ తేదీన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు స్వాజీనీని అరెస్టు చేసి జైలుకు పంపించారు. అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వామీజీకి తరువాత కర్ణాటక హైకోర్టులో షరతులతో బెయిల్ మంజూరు అయ్యింది. అయితే స్వామీజీ చిత్రదుర్గ జిల్లాలో అడుగుపెట్టడానికి అవకాశం లేదని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications