యూపీలో రౌడీల ఎన్ కౌంటర్, బెంగళూరులో అదే గతి: హోం మంత్రి ఆదేశం, తుపాకితో!
బెంగళూరు: ఉత్తరప్రదేశ్ లో రౌడీలను ఎలా ఎన్ కౌంటర్ చేస్తున్నారో కర్ణాటకలో కూడా అదే తరహాలో రౌడీషీటర్లకు బుద్ది చెప్పాలని ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. ముఖ్యంగా బెంగళూరు నగరంతో సహ రాష్ట్రంలోని అన్ని నగరాల్లో రౌడీషీటర్లను ఏరిపారేయాలని హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

విదాన సౌధలో మీటింగ్
బెంగళూరులోని విదాన సౌధలో పోలీసు అధికారులతో సమావేశం అయిన హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి పలు విషయాలపై చర్చించారు. రౌడీషీటర్లు, బార్లు, హుక్కా బార్లు, మట్కా, గంజాయి, డ్రగ్స్ సరఫరాను అరికట్టాలని రామలింగా రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. అనంతరం మంత్రి రామలింగా రెడ్డి మీడియాతో మాట్లాడారు.

బార్ అండ్ రెస్టారెంట్లు
బెంగళూరు నగరంతో సహ రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్లు అధికారులు సూచించిన సమాయానికి ఉదయం తియ్యాలని, చెప్పిన సమయానికి రాత్రి మూసివేయాలని పోలీసు అధికారులకు చెప్పానని మంత్రి రామలింగా రెడ్డి అన్నారు. చోరీ చేసిన సొత్తు ఎవరు కొనుగోలు చేసినా కేసులు నమోదు చేస్తామని మంత్రి రామలింగా రెడ్డి హెచ్చరించారు.

వడ్డీ వ్యాపారులు
బెంగళూరులో హుక్కా బార్లు మూసివేస్తున్నా వారు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్నారని, అందుకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని మంత్రి రామలింగా రెడ్డి అన్నారు. అధిక వడ్డి వసూలు చేసి పేదలను పీడిస్తున్న వడ్డీ వ్యాపారుల అంతు చూడాలని పోలీసు అధికారులకు సూచించానని మంత్రి రామలింగా రెడ్డి చెప్పారు.

బీజీపీ అధికారంలో 1,160 హత్యలు
కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో 1,160 హత్యలు జరిగాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 998 హత్యలు జరిగాయని, బీజేపీ పాలనలో కంటే మా పాలనలో నేరాలు చాల వరకూ తగ్గిపోయాయని, లైంగిక దాడులు తక్కువ అయ్యాయని మంత్రి రామలింగా రెడ్డి వివరించారు.

బీజేపీ హయంలో బాంబుపేలుళ్లు
కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో మూడు బాంబు పేలుళ్లు జరిగాయని, చర్చిల మీద దాడులు చేశారని, బెంగళూరు నగరంలో ఉంటున్న 50 వేల మంది ఈశాన్య భారతీయులు దాడులు చేస్తున్నారనే భయంతో నగరం విడిచి పారిపోయారని, కాంగ్రెస్ హాయంలో ఇలాంటి సంఘటనలు జరగలేదని హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి వివరించారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications