IT News:బెంగళూరుకు తగ్గనున్న ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ - ఫ్యూచర్ అక్కడే..!!
సాంకేతిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బెంగళూరు నగరం ఇప్పుడు హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, ముంబై, పూణే, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా, పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం బెంగళూరుకు గట్టి పోటీని ఇస్తున్న నగరాల్లో ముందుంది. ఈ పెరుగుతున్న పోటీని ఎదుర్కోవడానికి అదే సమయంలో బెంగళూరుపై ఉన్న మౌలిక సదుపాయాల భారాన్ని తగ్గించడానికి, కర్ణాటక ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసింది.
ఐటీ పెట్టుబడులకు భారీ ప్రోత్సాహకాలు
కర్ణాటక ప్రభుత్వం తన డ్రాఫ్ట్ ఐటీ పాలసీ 2025-30 కింద, బెంగళూరు వెలుపలి ప్రాంతాలకు ఐటీ పెట్టుబడులను మళ్లించేందుకు విస్తృతమైన వ్యయ-తగ్గింపు ప్రోత్సాహకాలను ప్రతిపాదించింది.మొదటి మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు మూలధనం,నిర్వహణ వ్యయాలను తగ్గించడం ద్వారా, కొత్త టెక్నాలజీ క్లస్టర్ల ఏర్పాటును వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దాదాపుగా, పరిశ్రమలు మరియు పెట్టుబడులను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నస్ట్రాటజీని పోలి ఉంటుంది.

టైర్ II, టైర్ III నగరాలకు లబ్ధి
ఈ కొత్త డ్రాఫ్ట్ ప్రకారం, కంపెనీలు టైర్ II (రెండవ దశ) మరియు టైర్ III (మూడవ దశ) నగరాలలో కార్యకలాపాలను స్థాపిస్తే, అద్దె, ఆస్తి పన్ను, విద్యుత్ సుంకం మరియు టెలికాం ఖర్చులలో రాయితీలు, మినహాయింపులు లభిస్తాయి.
బెంగళూరు వెలుపలి జిల్లాల్లోని ఐటీ, ఐటీ సేవా యూనిట్లకు వర్తించే ప్రధాన ప్రోత్సాహకాలు:
- అద్దె రీయింబర్స్మెంట్: రూ.2 కోట్ల వరకు 50 శాతం అద్దె తిరిగి చెల్లింపు.
- ఆస్తి పన్ను రీయింబర్స్మెంట్: మూడు సంవత్సరాల వరకు 30 శాతం ఆస్తి పన్ను తిరిగి చెల్లింపు.
- విద్యుత్ సుంకం మినహాయింపు: ఐదు సంవత్సరాల వరకు 100 శాతం విద్యుత్ సుంకం మినహాయింపు.
- టెలికాం/ఇంటర్నెట్ ఛార్జీలు: రూ.12 లక్షల వరకు 25 శాతం తిరిగి చెల్లింపు.
ఈ ప్రోత్సాహక పథకం చిన్న,మధ్య తరహా సంస్థలు (SMEs) తమ కార్యకలాపాలను నిర్వహించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.కర్ణాటకలోని ఐటీ సంస్థలు ఎక్కువగా బెంగళూరులోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఇది రాష్ట్రానికి, దేశానికి గణనీయమైన ఆదాయాన్ని తెస్తున్నప్పటికీ, పెరుగుతున్న డిమాండ్ను తట్టుకోవడానికి నగరం మౌలిక సదుపాయాలు సహకరించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే, బెంగళూరుపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఇతర నగరాల అభివృద్ధికి తోడ్పడటం అనే ద్వంద్వ లక్ష్యంతో కర్ణాటక ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని రూపొందించింది.
-
Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని -
శివరాత్రి రోజు మటన్ తిన్నా.. శుభ ముహూర్తాలను నమ్మను: సీఎం సంచలనం -
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications