షాకింగ్: మహిళను చెంపదెబ్బ కొట్టిన మంత్రి, కాళ్లకు దండం!(వీడియో)
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర మంత్రి ఒకరు తన దురుసు ప్రవర్తనతో వివాదంలో చిక్కుకున్నారు. తనకు భూమి కేటాయించలేదని ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను మంత్రి సోమన్న చెప్పదెబ్బ కొట్టారు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. దీంతో విపక్ష పార్టీలు మంత్రి రాజీనామా కోరుతూ డిమాండ్ చేస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. చామరాజ్నగర్ జిల్లా హంగాల గ్రామంలో భూ పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మౌలిక వనరుల అభివృద్ధి శాఖ మంత్రి వీ సోమన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 175 మందికి గ్రామీణ ప్రాంతాల్లో భూ క్రమబద్దీకరణకు ఉద్దేశించిన సెక్షన్ 94సీ ప్రకారం టైటిల్ డీడ్లను అందించారు.
అయితే, ఓ మహిళ దరఖాస్తు చేసుకున్నా.. ఆమెకు రెవెన్యూ శాఖ పట్టాను ఇవ్వలేదు. దీనిపై ఆమె వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో మంత్రి వద్దకు వెళ్లగానే ఆయన ఆమెను చెంపదెబ్బకొట్టారు. ఆ తర్వాత అక్కడేవున్న మహిళ.. మంత్రి కాళ్లకు దండం పెట్టింది. తన గోడును మంత్రికి తెలిపింది.
@BJP4TamilNadu@INCIndia @DMKITwing
— Murugesapandian Rangasami பலவேச கார துணை (@aiyanlogistics) October 23, 2022
Top stories (TV news)
Karnataka Minister V Somanna slaps woman
Oh my god , pic.twitter.com/NjeIrt8bX3
కాగా, ఆ తర్వాత మంత్రి ఆమెకు క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది. అయితే, మంత్రి తనను కొట్టలేదని, తన పట్టాను తనకు అందించారని బాధితురాలు మీడియాకు తెలపడం గమనార్హం. తమకు మంత్రి సాయం చేశారని, ఎలాంటి సమస్యా లేదని చెప్పారు.
అయితే, మంత్రి సోమన్న వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. మహిళలను గౌరవించే పద్ధతి ఇదేనా? అంటూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి పదవి నుంచి సోమన్నను తొలగించాలని కోరుతున్నారు.