Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భార్య దెబ్బతో మసీదులు, దర్గాలను టార్గెట్ చేసిన భర్త, వీడి దెబ్బతో సీసీటీవీ కెమెరాలు !

బెంగళూరు/హాసన్: కొంత మందికి చిన్నచిన్న విషయాలకు మనసు విరిగిపోతుంది. భార్య దెబ్బతో మసీదుల్లోకి, దర్గాల్లోకి రాకూడదని ఓ యువకుడిని మసీదు పెద్దలు నిషేధించారు. ఇదే విషయంలో కక్ష పెంచుకున్న యువకుడు మసీదులు, దర్గాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. మసీదుల్లో పేరుమోసిన దొంగను అరసీకెరె నగర పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుడు మోహమ్మద్ సుహెబ్ (35)గా గుర్తించామని పోలీసు అధికారులు తెలిపారు.

నిందితుడు మోహమ్మద్ సుహేబ్ నుంచి మొత్తం 7 యాంప్లిఫయర్లు, 6 సీసీటీవీ కెమెరాలు, 1 కంప్యూటర్, 1 టీవీ, 1 సౌండ్ మిక్సర్, 2 స్పీకర్లు, 2 మానిటర్లు, 1 డీవీఆర్, తాళాలు తీయడానికి ఉపయోగించే ఐరన్ రాడ్, 2 స్పీకర్లతో కూడిన హోమ్ థియేటర్, సీసీటీవీ కెమెరా స్విచ్, ఒక మానిటర్, కెనాన్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

 majidanddurgahs

దొంగతనం చేస్తున్ననిందితుడు మోహమ్మద్ సుహేబ్ ను అరిసికెరే పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడు మోహమ్మద్ సుహెబ్‌ మైసూరులోని ఇలావాల రబ్బానీ మసీదు, బిలికెరెలోని ఈద్గా మసీదు, హిరియపట్నంలోని పిర్దోస్‌ మసీదు, పాత హున్‌సూరులోని గౌసియా మసీదు, కేఆర్‌నగర్‌లోని జామియా మసీదు, కుబా మసీదు, హాసన్‌ లోని మదీనాలోని గుజరాతీ దర్గాలో, అరసికెరెలోని మసీదు, ఖాదర్ చావలి దర్గాలో నిందితుడు చోరీలు చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

హాసన్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాల వల్ల ఏర్పడిన గందరగోళం ఇంతా కాదు. నష్టం వివరాలు ఇక్కడ ఈ విషయాన్ని హసన్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ హరిరామ్ శంకర్ తెలిపారు. చోరీ కేసులో నిందితుడు మోహమ్మద్ సుహెబ్‌ను అరెస్టు చేశారు. నిందితుడు పది మసీదులు, కొన్ని దర్గాల్లో చోరీకి పాల్పడినట్లు సమాచారం. మొత్తం ఎనిమిది చోరీ కేసుల్లో ఇతడు ప్రమేయం ఉందని హసన్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ హరిరామ్ శంకర్ అన్నారు.

దొంగతనాలు చేస్తున్న నిందితుడు మోహమ్మద్ ను అరసికెరె పోలీసులు అరెస్ట్ చేశారు
. నిందితుడు మోహమ్మద్ అతను దొంగిలించిన వస్తువులను శ్రీరంగపట్నంలోని ఓ ఇంట్లో ఉంచి ఆపై విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. మోహమ్మద్ సుహెబ్ విరాజ్ పేట సున్నత్ వీధికి చెందినవాడు. అతనికి వివాహం అయిన తర్వాత అతని భార్యతో గొడవలు ఎక్కువగా జరిగాయి. భార్య దెబ్బతో జమాత్ నుండి మోహమ్మద్ బహిష్కరించబడ్డాడు. దీంతో ఆగ్రహించిన మోహమ్మద్ సుహెబ్ దర్గా, మసీదులను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డాడని హాసన్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ హరిరామ్ శంకర్ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+