Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ విషయంలో ఒకేమాట మీద నిలబడిన బీజేపీ, ఆప్, ఆ సీఎంకు సినిమా చూపించాలని ప్లాన్ !

బెంగళూరుతో సహా కొన్ని జిల్లాలకు తాగునీరు విషయంలో జీవనోపాధిగా ఉద్దేశించిన మేకదాటు ప్రాజెక్టు అమలును అనుమతించని తమిళనాడు చర్యను ఆప్ (అమ్ ఆధ్మీ), బీజేపీ, జేడీఎస్ తో సహ కన్నడ సంఘాల నాయకులు పలువురు ఖండించారు. లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ఇండియా కూటమిలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే భాగం అయ్యింది

కేంద్రంలో ఇండియా కూటమి గెలిస్తే బెంగళూరు నగర శివార్లలోని కావేరీ నదిపై కర్ణాటక రాష్ట్రం నిర్మించాలనుకున్న మేకేదాటు డ్యామ్‌ నిర్మాణాన్ని అడ్డుకుంటామని డీఎంకే తన మ్యానిఫెస్టోలో స్పష్టంగా పేర్కొంది. . డీఎంకే తన మ్యానిఫెస్టోలో మేకదాటు పథకానికి ఆటంకం కలిగించే అంశాన్ని ప్రస్తావించింది. తమిళనాడు చర్యను ఖండించిన ఆప్ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రు ఇండియా. కూటమిలో భాగమైన తమిళనాడులోని అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ మేకేదాటు రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని చెప్పడం విచారకరం అని అన్నారు.

Karnataka s BJP JDS and AAP leaders are uniting for Mekadatu project

తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ చర్య ఖండించదగినదని చంద్రు ఆరోపించారు. గురువారం ఆప్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రు మీడియాతో మాట్లాడారు. కర్ణాటకకు ప్రయోజనం ఏమిటి? అని ఇక్కడి ప్రభుత్వం ఆలోచిస్తుందా, లేదా ? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బెంగళూరు నగరానికి తాగునీటిని అందించడమే లక్ష్యంగా మేకెదాటు ప్రాజెక్టును కర్ణాటక నిర్మిస్తుందని చంద్రు గుర్తు చేశారు. మేకేదాటు రిజర్వాయర్‌ నిర్మించి వర్షాకాలంలో సముద్రంలోకి పోయే 65 నుంచి 66 టీఎంసీల అదనపు నీటిని నిల్వ చేయాలన్నది కర్ణాటక రాష్ట్రం ఉద్దేశం అని ముఖ్యమంత్రి చంద్రు అన్నారు.

మేకదాటు ప్రాజెక్ట్ నిర్మిస్తే కర్ణాటకకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తిని కూడా సులభతరం చేస్తుంది. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం రాజకీయ ఉద్దేశ్యంతో ఇలాంటి ప్రజాప్రయోజనాల కోసం నిర్మిస్తున్న మేకదాటు ప్రాజెక్టును అడ్డుకుంటుంది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చర్యలు సరికాదని ఫిర్యాదు చేశారు. కర్ణాటకపై విద్వేష రాజకీయాలు ఒకవైపు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విద్వేష రాజకీయాలను డీఎంకే నడుపుతోందని ముఖ్యమంత్రి చంద్రు ఆరోపించారు.

మేకేదాటు రిజర్వాయర్ నిర్మాణానికి చట్టపరమైన ఆమోదం లభించినా కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి నిరాకరణ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకే మిత్రపక్షంగా ఉండి మా ఆశలకు అడ్డుకట్ట వేయడం దురదృష్టకరం అని, తమిళనాడు సీఎం స్టాలిన్ నుండి ఇది మేము ఊహించలేదని, మేకేదాటు ప్రాజెక్టు కర్ణాటక రాష్ట్ర హక్కు అని కర్ణాటక ఆప్ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రు అభిప్రాయం వ్యక్తం చేశారు.

సాధారణ పరిస్థితుల్లో తమిళనాడుకు కర్ణాటక ప్రభుత్వం కావేరీ నీటిని విడుదల చేయాలనేది కావేరీ తీర్పులో స్పష్టం చేసింది. కష్టకాలంలో ఉన్న సమయంలో కావేరీ నీటిని మనం ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల వరదలు, కరువు కాలంలో నీటి వినియోగంలో కర్ణాటక, తమిళనాడు రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రు అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గందరగోళానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని, ఇండియా కూటమికి మిత్రపక్షంగా ఉన్న డీఎంకే పార్టీని ఒప్పించాలని, రెండు రాష్ట్రాల మధ్య గందరగోళం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆప్ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రు డిమాండ్ చేశారు.

కర్ణాటక బీజేపీ సీనియర్ నాయకుడు, ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ గురువారం విలేకరుల సమావేశంలో డీఎంకే తీరును ఖండిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఇదే సమయంలో కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వాన్ని అశోక్ నిలదీశారు. మేకేదాటు ప్రాజెక్టుపై డీఎంకే మేనిఫెస్టోలోని విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమ వైఖరిని తెలియజేయాలని అశోక్ డిమాండ్ చేశారు

Karnataka s BJP JDS and AAP leaders are uniting for Mekadatu project

ఇండియా కూటమిలో మీకు డీఎంకే పొత్తు ముఖ్యమో, లేక కర్ణాటక రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యమో అని బహిరంగంగా వెల్లడించాలని బీజేపీ నాయకుడు అశోక్ డిమాండ్ చేశారు. కోవిడ్‌ సమయంలో అంటు వ్యాధులు వ్యాపిస్తాయని తెలిసినా ఏమాత్రం పట్టించుకోకుండా సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ తో పాటు కాంగ్రెస్ నాయకులు మేకేదాటు ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేశారని అశోక్ గుర్తు చేశారు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారని, తమిళనాడు సీఎం స్టాలిన్ తీరుపై మీరు ఏం చెబుతారని అశోక్ సీఎం సిద్దరామయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు.

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన మ్యానిఫెస్టోలో మేకదాటు స్రాజెక్టును అడ్డుకుంటామని అంత స్పష్టంగా ప్రకటించారని ఇప్పుడు సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ స్టాలిన్ వైఖరిని ఎందుకు ఖండించలేదని అశోక్ ప్రశ్నించారు. మేము అధికారంలో ఉన్న సమయంలో డీకే శివకుమార్ మేకేదాటులో స్నానం చేశారు. మొహం కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవని ఆరోపించారని అశోక్ గుర్తు చేశారు. అయితే ఇప్పుడు బెంగళూరులో తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని అశోక్ మండిపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+