మనీ లాండరింగ్ కేసులో కార్తీ చిదంబరం అరెస్ట్
Recommended Video

చెన్నై: మనీ లాండరింగ్ కేసులో మాజీ కేంద్ర హోం మంత్రి కార్తీ చిదంబరాన్ని సిబిఐ అధికారులు బుధవారం ఉదయం చెన్నైలో అరెస్ట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సిబిఐ అధికారులు కార్తీ చిదంబరాన్ని అరెస్ట్ చేశారు.
మరోవైపు ఇంతకుముందే కార్తీ చిదంబరానికి చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్ ను కూడ సిబిఐ అధికారులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది

యూకె నుండి చెన్నై తిరిగి వచ్చిన వెంటనే కార్తీ చిదంబరాన్ని అరెస్ట్ చేశారుఫెమా(ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్) నిబంధనల ఉల్లంఘన, కేసుకు సహకరించడం లేదని ఆరోపణలతో బుధవారం ఆయనను చెన్నైలో అదుపులోకి తీసుకుంది.
చిదంబరం కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు మారిషస్నుంచి పెట్టుబడులనుఅందుకునే విషయంలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు నిబంధనలను ఐఎన్ఎక్స్ మీడియా ఉల్లంఘించినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసులో చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంపై దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది.
అలాగే ఐఎన్ఎక్స్ మీడియా డైరెక్టర్లు - పీటర్, ఇంద్రాణి ముఖర్జీలతో సహా నిందితులపై ఎన్ఐఆర్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications