Delhi Accident: ఢిల్లీ యాక్సిడెంట్ ఘటనలో సీసీ ఫుటేజ్ విడుదల.. వారి ఉరిశిక్ష వేయాలన్న కేజ్రీవాల్..
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘోర ఘటనపై స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వేలమంది రోడ్డుపైకి
ఆందోళన వ్యక్తం చేశారు. సుల్తాన్పురి పోలీస్ స్టేషన్ వెలుపల నిరసన తెలిపారు. ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున . స్కూటీపై వెళుతున్న యువతిని ఢీకొట్టిన కారు.. ఆమెను 20 కిలోమీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది.

డిసెంబర్ 31న
ఐదుగురు నిందితులు డిసెంబర్ 31న తప్ప తాగి మారుతి సుజికీ బెలానో కారుతో యువతిని ఢీకొట్టారు. ఢీకొట్టడమే కాదు కిలోమీటర్లు దూరం ఈడ్చుకెళ్లారు. నిందితుల్లో ఒకరు క్రెడిట్ కార్డ్ కలెక్షన్ ఏజెంట్, డ్రైవర్, రేషన్ షాప్ యజమాని ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి
దీపక్ దహియా వివరించారు.

18 నుంచి 20 కిలోమీటర్లు
ఆయన లాడ్పూర్ గ్రామంలోని కంఝవాలా రోడ్డులో మిఠాయి దుకాణం నడుపుతున్నాడు. తమ వాహనానికి చిక్కిన మహిళ మృతదేహాన్ని నిందితులు 18 నుంచి 20 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లారని, అది దాదాపు గంటన్నర పాటు కొనసాగిందని ఆయన చెప్పారు.

ఉదయం 3:20
"ఉదయం 3:20 అయింది.. నేను షాపు బయట నిలబడి ఉండగా 100 మీటర్ల దూరంలో వాహనం నుంచి పెద్ద శబ్ధం వినిపించింది. టైరు పగిలిందని అనుకున్నాను. కారు కదిలిన వెంటనే ఒక మృతదేహం కనిపించింది. వారు మృతదేహాన్నీ ఈడ్చుకెళ్లారు. నేను వెంటనే పోలీసులకు సమాచారం అందించాను" అని దహియా తెలిపారు.
గంటన్నర పాటు
కొంత సమయం తరువాత, తెల్లవారుజామున 3:30 గంటలకు, కారు యు-టర్న్ తీసుకుందని, మహిళ మృతదేహం వాహనం కింద ఇరుక్కుపోయిందని అతను చెప్పాడు. నిందితులు దాదాపు 4-5 కిలోమీటర్ల రోడ్డుపై యూటర్న్లు తీసుకుని పదే పదే డ్రైవింగ్ చేశారని దహియా వివరించారు. "నేను చాలాసార్లు వారిని ఆపడానికి ప్రయత్నించాను, కానీ వారు వాహనాన్ని ఆపలేదు. సుమారు గంటన్నర పాటు వారు మహిళ మృతదేహాన్ని సుమారు 20 కి.మీ. ఈడ్చుకెళ్లారని చెప్పారు.
కేవలం ప్రమాదం కాదు
తన బైక్తో కారును కూడా వెంబడించడంతో పాటు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు దహియా చెప్పారు. సుమారు గంటన్నర తర్వాత, కంఝవాలా రోడ్డులోని జ్యోతి గ్రామ సమీపంలో కారు నుంచి మృతదేహం పడిపోయిందని, ఆ తర్వాత నిందితులు పారిపోయారని చెప్పారు. "ఇది కేవలం ప్రమాదం కాదు" దహియా నొక్కి చెప్పారు.
మరణశిక్ష విధించాలి
ఈ కారు యాక్సిడెంట్ కు సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది. నిందితులు మృదేహాన్ని ఈడ్చుకెళ్తూ యూటర్న్ తీసుకున్నట్లు వీడియోలో కనిపించింది. ఈ రోడ్డు ప్రమాదంపై ఢిల్లీ సీఎం క్రేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఐదుగురు నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications