కేజ్రీవాల్ ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్: గ్రాండ్గా..: కనీసం 50 వేల మంది: కనివినీ ఎరుగని భద్రత..!
Recommended Video
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు ఇది. సుమారు 48 గంటలుగా ట్విట్టర్లో హైరేంజ్లో ట్రెండింగ్లో ఉంటున్న పేరు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని, మూడుసార్లు హస్తినను ఏకచ్ఛాత్రాధిపత్యం కింద ఏలిన కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండుసార్లు మట్టి కరిపించిన నేతగా కీర్తిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీని కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితం చేశారాయన. కాంగ్రెస్ పార్టీ బోణీ కూడా కొట్టలేకపోయింది.

16న ప్రమాణ స్వీకారం..
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోవడంతో.. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆమ్ఆద్మీ పార్టీ కసరత్తు చేస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని నిర్ణయించారు. ఈ నెల 16వ తేదీన.. అంటే ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక రామ్లీలా మైదాన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వేదిక ఎక్కడనేది స్పష్టం కావడంతో.. ఢిల్లీ పోలీసులు రామ్లీలా మైదానాన్ని తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. కట్టుదిట్టమైన భద్రతను కల్పించనున్నారు.

కనీసం 50 వేల మందికి..
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ ఎంత గ్రాండ్ సక్సెస్ సాధించిందో.. అంతే గ్రాండ్గా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించడానికి అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయబోతుండటం ఇది మూడోసారి. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
కనీసం 50 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా ఏర్పాట్లు చేయనుంది. బీజేపీయేతర పార్టీల నాయకులు, పలువురు ముఖ్యమంత్రులకు ఆహ్వాన పత్రాలు అందనున్నాయి.

మమతా బెనర్జీ, పినరయి సహా..
కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), పినరయి విజయన్ (కేరళ), నవీన్ పట్నాయక్ (ఒడిశా) ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తదితరులు హాజరు కావడం దాదాపు ఖరారైనట్టేననని అంటున్నారు. జనతాదళ్ (సెక్యులర్) అధ్యక్షుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి లేదా.. ఆయన పార్టీ ప్రతినిధులు ఈ ప్రమాణ స్వీకారానికి హాజరకావచ్చని తెలుస్తోంది.

ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై కాల్పులతో..
ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన నేపథ్యంలో.. రామ్లీలా మైదానానికిి భారీ భద్రతను కల్పించబోతోంది ప్రభుత్వం. పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరు కాబోతున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టనుంది. రామ్లీలా మైదానానికి వచ్చే వారిపై నిఘా ఉంచనుంది. డ్రోన్ల సహకారంతో భద్రతను పర్యవేక్షించే అవకాశాలు ఉన్నాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications