Kerala:కొబ్బరి తోటల నేల..కోట్లాది మంది ఆత్మీయ పిలుపు-పేరు వెనుక చరిత్ర ఏంటి?
కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా "కేరళం"గా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మలయాళ భాషా అస్తిత్వాన్ని, ఆ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.భారతదేశం భాషా ప్రాతిపదికన రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు (నవంబర్ 1, 1956), మలయాళం మాట్లాడే వారందరినీ కలిపి 'కేరళ' రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అయితే మలయాళంలో ఆ రాష్ట్రాన్ని ఎప్పుడూ 'కేరళం' అనే పిలుస్తారు. దశాబ్దాల నాటి ఈ పేరు మార్పు కోరికకు ఇప్పుడు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో, అసలు 'కేరళం' అనే పేరు వెనుక ఉన్న లోతైన చరిత్ర, పౌరాణిక గాథలు భాషా పరమైన అర్థాలు,ఈ పేరు వెనుక ఉన్న మూలాలు ఏంటో తెలుసుకుందాం.
ఇంతకీ
కొబ్బరి చెట్ల భూమి
అత్యంత ప్రాచుర్యం పొందిన వివరణ ప్రకారం, మలయాళంలో 'కేర' (Kera) అంటే కొబ్బరి చెట్టు అని, 'ఆళం' (Alam) అంటే భూమి లేదా ప్రదేశం అని అర్థం. కేరళ భూభాగం అంతటా కొబ్బరి చెట్లు సమృద్ధిగా ఉండటం వల్ల ఆ ప్రాంతానికి 'కేరళం' (కొబ్బరి చెట్ల భూమి) అనే పేరు వచ్చిందని భావిస్తారు. విదేశీ యాత్రికులు కూడా తమ రచనల్లో ఈ ప్రాంతాన్ని కొబ్బరి సిరి కలిగిన నేలగా అభివర్ణించారు.

చేర సామ్రాజ్యం -'చేరాలం'
చారిత్రక ఆధారాల ప్రకారం, ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని 'చేర' (Chera) రాజవంశీయులు పాలించారు. 'చేర' రాజుల ఆధీనంలో ఉన్న భూమి కాబట్టి దీనిని 'చేరాలం' (Cheralam) అని పిలిచేవారు. కాలక్రమేణా సంస్కృతీకరణ లేదా ఉచ్చారణలో మార్పుల వల్ల 'చేర' కాస్తా 'కేర'గా మారి 'కేరళం'గా స్థిరపడిందని చరిత్రకారులు చెబుతారు. మలయాళం, తమిళం వంటి ద్రావిడ భాషల్లో 'చ' మరియు 'క' అక్షరాల మార్పిడి సహజంగా జరుగుతుంటుంది.
అశోకుడి శిలాశాసనాల్లో 'కేరళపుత్ర'
కేరళ అనే పేరు కేవలం మౌఖికంగానే కాకుండా లిఖితపూర్వక ఆధారాల్లోనూ చాలా ప్రాచీనమైనది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి చెందిన మౌర్య చక్రవర్తి అశోకుడి శిలాశాసనాల్లో ఈ ప్రాంతాన్ని 'కేరళపుత్ర' (Keralaputra) అని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోని స్వతంత్ర రాజ్యాలైన చోళ, పాండ్యలతో పాటు కేరళపుత్రులను కూడా అశోకుడు ప్రస్తావించడం దీని పురాతనత్వానికి నిదర్శనం.
పరశురాముడి గొడ్డలి - పౌరాణిక గాథ
పురాణాల ప్రకారం, విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరినప్పుడు, సముద్రం వెనక్కి తగ్గి బయటపడిన భూభాగమే కేరళం. అందుకే దీనిని 'పరశురామ క్షేత్రం' అని కూడా అంటారు. ఐతరేయ ఆరణ్యకం వంటి పురాతన సంస్కృత గ్రంథాల్లోనూ ఈ ప్రాంతం గురించి ప్రస్తావనలు ఉన్నాయి.
విదేశీయుల పిలుపు - 'మలబార్'
కేరళానికి కేరళం ఒక్కటే పేరు కాదు. అరబ్ వర్తకులు మరియు యూరోపియన్ యాత్రికులు ఈ ప్రాంతాన్ని 'మలబార్' (Malabar) అని పిలిచేవారు. మలయాళంలో 'మల' అంటే కొండ, అరబిక్/పర్షియన్ లో 'బార్' అంటే భూమి. వెరసి 'కొండల భూమి' అని దీని అర్థం. అయినప్పటికీ స్థానిక ప్రజలు మాత్రం ఎప్పుడూ తమ నేలను 'కేరళం'గానే ఆరాధించారు.
అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు ఉన్న 'కేరళ' అనే పేరు ఇకపై మన రాజ్యాంగబద్ధంగా, అధికారికంగా 'కేరళం'గా చలామణిలోకి రానుంది. ఇది కేవలం ఒక అక్షరం మార్పు కాదు, మలయాళీల ఆత్మగౌరవానికి ,వారి మూలాలకు దక్కిన గుర్తింపు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications