Aunty: హోటల్ రూమ్ లో కేరళ ఆంటీ హత్య, ప్రియుడికి ?, ఎందుకు వచ్చారు ? మతాలు వేరు, ఏం జరిగింది !
చెన్నై/ కోయంబత్తూరు: ప్రముఖ వాణిజ్య నగరంలోని ఓ ఫేమస్ హోటల్ లో 10 రోజుల క్రితం ఓ జంట గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి టిప్పు టాపుగా బయటకు వెలుతున్న ఆ జంట రాత్రి మళ్లీ అదే హోటల్ లోని గదికి చేరుకుని అక్కడే ఉన్నారు. ఇలా కొన్ని రోజుల నుంచి ఆంటీ, అంకుల్ హోటల్ నుంచి బయటకు వెళ్లి వస్తున్నారు. ఫేమస్ హోటల్ లో సరికొత్త టెక్నాజీతో డోర్ లాక్ లు ఏర్పాటు చేశారు.
డోర్ లాక్ బయట వేశారా ? లేక లోపల వేశారా ? అని బయట నుంచి చూసినవాళ్లకు తెలీదు. రెండు రోజుల నుంచి ఆంటీ, అంకుల్ ను హోటల్ సిబ్బంది చూడలేదు. పని మీద బయటకు వెళ్లి ఉంటారని హోటల్ సిబ్బంది అనుకున్నారు. ఇదే సమయంలో హోటల్ రూమ్ లో నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డూప్లికేట్ తాళంతో డోర్ లాక్ తీశారు. అంతే హోటల్ రూమ్ లో ఆంటీ శవమై కనిపించింది. తీవ్రగాయాలైన అంకుల్ స్పృహ తప్పి పడి ఉన్నాడు.
పోలీసుల విచారణలో కేరళకు చెందిన ఆంటీది ఒక మతం, అదే రూమ్ లో ఉన్న అంకుల్ ది మరో మతం అని వెలుగు చూసింది. ఆంటీని ఎవరు హత్య చేశారు, అంకుల్ మీద ఎవరు దాడి చేశారు ? అనే విషయం అంతు చిక్కపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆంటీ, అంకుల్ వ్యాపారం పని మీద వచ్చారా ?, లేక అక్రమ సంబంధం పెట్టుకుని ఇక్కడి వచ్చారా అనే విషయం మాత్రం తెలీడం లేదని పోలీసులు అంటున్నారు.

ఫేమస్ హోటల్స్
తమిళనాడులోని కోయంబత్తూరు సిటీ వాణిజ్య నగరిగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. కోయంబత్తూరు దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి వెలుతున్నారు. కోయంబత్తూరు పరిసర ప్రాంతాల్లో అనేక ఫ్యాక్టరీలు, పరిశ్రమలు ఉండటంతో ఆ సిటీలో హోటల్స్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

ఆంటీ, అంకుల్ ఎంట్రీ
కోయంబత్తూరులోని గాంధీపురంలోని క్రాస్ కట్ రోడ్డులో ఓ ఫేమస్ హోటల్ ఉంది, గత నెల జులై 26వ తేదీన ఓ ఆంటీ, అంకుల్ ఆ హోటల్ లోకి వెళ్లారు. కేరళలోని కోజికోడ్ కు చెందిన ముస్తఫా (58), కోజికోడ్ కు చెందిన బింధు (46) అనే ఆంటీ హోటల్ లో ఓ రూమ్ తీసుకున్నారు. అప్పటి నుంచి ముస్తఫా, బింధు అదే హోటల్ లో ఉన్నారు.

టిప్పుటాప్ గా ఉన్న ఆంటీ, అంకుల్
చూడటానికి శ్రీమంతులు లాగా ఉన్న ముస్తఫా, బింధు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి టిప్పుటాపుగా రెడీ అయ్యి బయటకు వెలుతున్నారు. తరువాత ముస్తఫా, బింధు జంట రాత్రి మళ్లీ హోటల్ లోని గదికి చేరుకుని అక్కడే ఉన్నారు. ఇలా కొన్ని రోజుల నుంచి బింధు ఆంటీ, ముస్తఫా అంకుల్ హోటల్ నుంచి బయటకు వెళ్లి వస్తుండటంతో హోటల్ సిబ్బందికి ఎలాంటి అనుమానం రాలేదు.

ఆంటీ రూమ్ లో నుంచి దుర్వాసన
ఫేమస్ హోటల్ లో సరికొత్త టెక్నాజీతో డోర్ లాక్ లు ఏర్పాటు చేశారు. డోర్ లాక్ బయట వేశారా ? లేక లోపల వేశారా ? అని బయటకు తెలీదు. రెండు రోజుల నుంచి బింధు ఆంటీ, ముస్తఫా ను హోటల్ సిబ్బంది చూడలేదు. పని మీద బయటకు వెళ్లి ఉంటారని హోటల్ సిబ్బంది వారికి ఫోన్ చెయ్యలేదని తెలిసింది. ఇదే సమయంలో ముస్తఫా, బింధు కలిసి ఉంటున్న రూమ్ లో నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది.

శవమైన కేరళ ఆంటీ
సమాచారం తెలుసుకున్న కోయంబత్తూరు సిటీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డూప్లికేట్ తాళంతో హోటల్ రూమ్ డోర్ లాక్ తీశారు. అంతే హోటల్ రూమ్ లో బింధు ఆంటీ శవమై కనిపించింది. తీవ్రగాయాలైన ముస్తఫా స్పృహ తప్పి పడివున్నాడు. బింధు హత్యకు గురై ఆమె శవం కుళ్లిపొవడంతో దుర్వాసన వచ్చిందని కోయంబత్తూరు సిటీ పోలీసులు అంటున్నారు.

హోటల్ రూమ్ లో ఏం జరిగింది ?
కోయంబత్తూరు పోలీసుల విచారణలో కేరళకు చెందిన బింధు ఆంటీది హిందూ మతం అని, అదే రూమ్ లో ఉన్న ముస్తఫాది ముస్లీం మతం అని వెలుగు చూసింది. కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలో తమిళనాడులో అనేక నియమ నిబంధనలు జారీ చేశారు. ఇప్పటికే కట్టుదిట్టమైన నియమాలు అమలులో ప్రాంతాల్లో లాక్ డౌన్ జారీ చేశారు. ఇలాంటి సమయంలో బింధు, ముస్తఫా కేరళ నుంచి ఎందుకు తమిళనాడులోని కోయంబత్తూరు వచ్చారు ?, ఇన్ని రోజులు హోటల్ రూమ్ లో ఉన్న వీరిద్దరు ఎవరెవరిని కలిశారు ?, వ్యాపారం పని మీద వచ్చారా ?, లేక ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకుని పారిపోయి ఇక్కడికి వచ్చారా ? అంటూ కోయంబత్తూరు పోలీసులు ఆరా తీస్తున్నారు.

అక్రమ సంబంధంతో హత్య ?
అక్రమ సంబంధం పెట్టుకున్న బింధు, ముస్తఫా కోయంబత్తూరు వచ్చి ఇన్ని రోజులు హోటల్ గదిలో ఉన్నారా, ఇద్దరిని చంపడానికి ఎవరైనా ప్రయత్నించారా ? అనే విషయం తెలీయడం లేదని పోలీసులు అన్నారు. బింధు, ముస్తఫా ఉంటున్న హోటల్ రూమ్ లోకి ఎవరైనా వచ్చి వెళ్లారా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద కేరళ ఆంటీ బింధు కోయంబత్తూరు హోటల్ లో హత్యకు గురికావడం, ముస్తఫాకు తీవ్రగాయాలు కావడంతో హోటల్ సిబ్బంది హడలిపోయారు. కేరళలోని కోజీకోడ్ లోని ముస్తఫా, బింధు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కేసు విచారణ చేస్తున్నామని కోయంబత్తూరు పోలీసులు అంటున్నారు. కేరళ పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు విచారణ చేస్తున్నామని కోయంబత్తూరు పోలీసు అధికారులు అంటున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications