నటి ఖుష్బూకు షాక్: నో పాస్పోర్టు, ఎందుకు?
సినీ నటి ఖుష్బూ పాస్పోర్టును పునరుద్ధరించడానికి సంబంధిత అధికారులు నిరాకరించారు. ఆమెపై క్రిమినల్ కేసులు నమోదు అయి ఉండడంతో ఆ నిర్ణయం తీసుకున్నారు.
చెన్నై: సినీనటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ పాస్పోర్టును పునరుద్ధరించేందుకు అధికారులు నిరాకరించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమెపై మూడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీంతో చెన్నై రీజినల్ పాస్పోర్టు కార్యాలయం కొత్త పాస్పోర్టు పుస్తకాన్ని ఇచ్చేందుకు తిరస్కరించింది.
తనపై నమోదైన కేసులన్నీ ఎన్నికలకు సంబంధించినవేననీ, అందులోనూ వాటిపై హైకోర్టు స్టే విధించింది కదా అని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాస్పోర్టును పునరుద్ధరించేలా అధికారులను ఆదేశించాలంటూ ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

తన పాస్పోర్టు 2022 వరకు చెల్లుబాటులో ఉంటుందనీ, తరచూ విదేశీ పర్యటనల వల్ల ప్రస్తుతం పాస్పోర్టు పుస్తకంలోని అన్ని పేజీలు స్టాంప్ చేసి ఉన్నాయని ఆమె తెలిపారు. కాంగ్రెసుకు ప్రచారం చేస్తున్న క్రమంలో తనపై తప్పుడు కేసులు బనాయించారని ఆమె అంటున్నారు.
కాగా గత ఎన్నికల సందర్భంగా ఆమెపై అండిపట్టి పోలీస్ స్టేషన్లో 'క్రిమినల్' కేసు నమోదై ఉందనీ... దీని కారణంగా తాము పాస్పోర్టును పునరుద్ధరించలేమని అధికారులు ఖుష్బూకి తెలిపారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications