Killer: ప్రియురాలు 35 పీస్ లు, హంతకుడి మీద హిందూ కార్యకర్తల దాడి, పోలీసుల కాల్పులు !
న్యూఢిల్లీ/తీహార్: ప్రియురాలు శ్రద్దాను అతికిరాతకంగా హత్య చేసిన ఆమె ప్రియుడు హఫ్తాబ్ మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించిన సంఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యులను వదిలేసి నమ్మి వెంట వచ్చిన ప్రియురాలితో సహజీవనం చేసిన హఫ్తాబ్ పెళ్లి విషయం వచ్చే సరికి ఆమెను హత్య చేసి ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికేశాడు. ఈ కేసులోకి కిరాతకుడు హఫ్తాబ్ మీద సోమవారం ఢిల్లీలో హిందూ కార్యకర్తలు దాడి చేశారు. చేతిలో కత్తులు పట్టుకుని పోలీసు జీపులో నుంచి హఫ్తాబ్ ను బయటకు లాగి హత్య చెయ్యడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.
Romance: భర్తతో కాపురం, రాత్రికి ఎంజాయ్ చేద్దాం రాఅని ప్రియుడు ఫోన్, నువ్వెంత నీ బతుకెంత ?, నన్నే !
కిరాతకుడికి నార్కో పరీక్షలు
ప్రియురాలు శ్రద్దా హత్య కేసులో ఆమె ప్రియుడు హఫ్తాబ్ ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా శ్రద్ద హత్య కేసు కలకలం రేపింది. ఈ కేసులో హఫ్తాబ్ కు నార్కో అనాలసిన్ పరీక్షలు నిర్వహించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. నిందితుడికి నార్కోపరీక్షలు నిర్వహించడానికి సోమవారం ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి తీసుకెళ్లారు.
పోలీసు వాహనంపై దాడి
హఫ్తాబ్ కు నార్కోఅనాలసీస్ పరీక్ష్లలు నిర్వహించిన తరువాత భారీ బందోబస్తు మద్య అతన్ని తీహార్ జైలుకు తరలించడానికి బయటకు తీసుకువచ్చారు. ఆ సందర్బంలో తాము హిందూ సేన కార్యకర్తలు అని చెప్పిన కొందరు వ్యక్తులు హఫ్తాబ్ ను తరలిస్తున్న పోలీసు వాహనం మీద దాడి చేసి అతన్ని బయటకు లాగడానికి ప్రయత్నించారు.
హడలిపోయిన పోలీసులు
ఆ సందర్బంలో హిందూసేన కార్యకర్తలు అని చెప్పిన వారి చేతుల్లో కత్తులు ఉండటంతో పోలీసులు హడలిపోయారు. హఫ్తాబ్ వెలుతున్న వాహనం మీద వాళ్లు దాడి చేశారు. హఫ్తాబ్ ను పోలీసు వ్యాన్ లో నుంచి బయటకు లాగడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాల్పులు జరిపిన పోలీసులు
ఆ సందర్బంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపినా హిందూసేన కార్యకర్తులు ఏమాత్రం బయపడలేదు, తరువాత పోలీసులు భారీబందో బస్తుతో కిరాతకుడు హఫ్తాబ్ ను తీహార్ సెంట్రల్ జైలుకు తరలించారు. మొత్తం మీద ప్రియురాలు శ్రద్దాను కిరాతకంగా పీస్ పీస్ చేసి చంపిన హఫ్తాబ్ మీద హత్యాయత్నం జరగడం ఢిల్లీలో కలకలం రేపింది. ,