Kisan Credit Card చెల్లుబాటు 6 సంవత్సరాలకు?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒకేసారి రెండు కీలక రంగాలపై దృష్టి సారించింది.. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు (UCBs) రైతులకు అందించే కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) రుణాలు. రుణాల వ్యవస్థ పారదర్శకంగా, క్రమబద్ధంగా ఉండాలన్న ఉద్దేశంతో కొత్త మార్గదర్శకాల దిశగా ఆర్బీఐ అడుగులు వేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో పనిచేస్తున్న సహకార బ్యాంకులైనప్పటికీ, సభ్యులకు పూచీకత్తు లేకుండా ఇష్టానుసారంగా రుణాలు మంజూరు చేయడం సరైంది కాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. రుణాల పంపిణీకి సంబంధించి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.

ఈ నేపథ్యంలో యూసీబీల కోసం కొత్త నిబంధనల ముసాయిదాను రూపొందించి అన్ని రాష్ట్రాలు, సంబంధిత బ్యాంకులకు పంపించింది. వాటిపై అభిప్రాయాలు సేకరించిన తర్వాత తుది మార్గదర్శకాలు ప్రకటించనున్నట్లు తెలిపింది. దీని ద్వారా రుణాల మంజూరులో క్రమశిక్షణ పెరుగుతుందని భావిస్తున్నారు.
రైతులకు ఊరట: Kisan Credit Card మార్పులు
దేశవ్యాప్తంగా లక్షలాది రైతులకు ఉపయోగపడే కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకాన్ని మరింత సరళీకరించేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. రైతులు రుణాల కోసం ఎదుర్కొనే ఇబ్బందులు తగ్గించి, సకాలంలో నిధులు అందేలా చేయడమే లక్ష్యం.
RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకారం, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన రూల్స్ను ఒకే విధానంలోకి తీసుకువచ్చి, స్పష్టంగా అర్థమయ్యేలా మార్పులు చేస్తారు. దీని వల్ల బ్యాంకులు కూడా వేగంగా రుణాలు అందించగలవు.
కొత్త మార్గదర్శకాల్లో ముఖ్యాంశాలు:
- పంట సీజన్లకు అనుగుణంగా రుణ పరిమితి నిర్ణయం
- ప్రతి పంట సైకిల్ ఆధారంగా ఫైనాన్సింగ్
- అవసరానికి అనుగుణంగా సులభంగా నిధుల ఉపసంహరణ
- పదే పదే కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం తగ్గింపు
KCC చెల్లుబాటు 6 సంవత్సరాలకు?
ఇప్పటివరకు కిసాన్ క్రెడిట్ కార్డు కాలపరిమితి తక్కువగా ఉండేది. ఇప్పుడు దాన్ని ఆరు సంవత్సరాలకు పొడిగించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఈ మార్పు అమల్లోకి వస్తే రైతులు ప్రతి సంవత్సరం కొత్త కార్డు కోసం బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీర్ఘకాలిక ప్రణాళికతో వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించేందుకు ఇది ఉపకరిస్తుంది.
MSMEలకు గుడ్ న్యూస్
పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పించే దిశగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (MSMEs) పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచే ఆలోచన కూడా ముందుకు వచ్చింది. దీని వల్ల చిన్న వ్యాపారులకు మూలధన సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.
మొత్తానికి, బ్యాంకింగ్ వ్యవస్థలో క్రమబద్ధత పెంచడంతో పాటు రైతులు, చిన్న వ్యాపారులు సులభంగా రుణాలు పొందేలా మార్పులు చేయాలన్నది ఆర్బీఐ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తే గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలకు ఊతమివ్వవచ్చని నిపుణులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications