కుమార రాజీనామా? గవర్నర్తో అపాయింట్మెంట్ ఫిక్స్?
బెంగళూరు: మూడు వారాలుగా కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి సోమవారం సాయంత్రం తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోయే దశకు చేరుకుంది. శాసనసభలో బలపరీక్షను ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయన గవర్నర్ వజూభాయ్ వాలా అపాయింట్మెంట్ కోరారు. ఈ సాయంత్రం 7 గంటలకు కుమారస్వామి.. రాజ్భవన్లో గవర్నర్ను కలుసుకుని తన రాజీనామా పత్రాన్ని అందజేస్తారని సమాచారం.

101కి క్షీణించిన కాంగ్రెస్ బలం..
13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడిన విషయం తెలిసిందే. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ కేఆర్ రమేష్కుమార్ ఆమోదించలేదు. అయినప్పటికీ- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారు శాసనసభలో అడుగు పెట్టే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో- ప్రభుత్వాన్ని కొనసాగించడానికి 105 మంది సభ్యుల బలం అవసరం అవుతుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సంఖ్యాబలం 101కి క్షీణించింది.

బీజేపీకి ఆహ్వానం ఇక లాంఛనమే
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీకి తగినంత బలం ఉంది. ప్రస్తుతం ఆ పార్టీకి శాసనసభలో 105 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి గుడ్బై చెప్పిన ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఆర్ శంకర్, నగేష్ కూడా ప్రస్తుతం బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీనితో ప్రతిపక్ష బీజేపీ సభ్యుల బలం 107కు చేరుతుంది. ఆయా సమీకరణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే- బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇక లాంఛనప్రాయమే అవుతుంది. ప్రత్యామ్నాయ పార్టీగా గవర్నర్ వజూభాయ్ వాలా బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించడం ఖాయమే.

ఇక బలపరీక్ష లేనట్టే!
తనకు తానుగా కుమారస్వామి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో- శాసనసభలో ఇక బలపరీక్షకు అవకాశం ఉండకపోవచ్చు. నిజానికి- గురువారం నాడే కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉండగా.. దాన్ని సోమవారం వరకూ వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. ఇక బల నిరూపణ తప్ప కుమారస్వామి ముందు మరో ప్రత్యామ్నాయం లేదు. బల పరీక్ష నిర్వహించాల్సి వచ్చిన తరువాతైనా ఆయన రాజీనామా తప్పదు. ఈ పరిస్థితుల్లో తన సంఖ్యాబలాన్ని నిరూపించుకోలేక పరువు పోగొట్టుకోవడం కంటే హుందాగా తప్పుకోవాలని కుమారస్వామి నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
-
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్ను చిత్తు చేసిన సన్రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!!












Click it and Unblock the Notifications