కుమార రాజీనామా? గవర్నర్తో అపాయింట్మెంట్ ఫిక్స్?
బెంగళూరు: మూడు వారాలుగా కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి సోమవారం సాయంత్రం తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోయే దశకు చేరుకుంది. శాసనసభలో బలపరీక్షను ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయన గవర్నర్ వజూభాయ్ వాలా అపాయింట్మెంట్ కోరారు. ఈ సాయంత్రం 7 గంటలకు కుమారస్వామి.. రాజ్భవన్లో గవర్నర్ను కలుసుకుని తన రాజీనామా పత్రాన్ని అందజేస్తారని సమాచారం.

101కి క్షీణించిన కాంగ్రెస్ బలం..
13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడిన విషయం తెలిసిందే. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ కేఆర్ రమేష్కుమార్ ఆమోదించలేదు. అయినప్పటికీ- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారు శాసనసభలో అడుగు పెట్టే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో- ప్రభుత్వాన్ని కొనసాగించడానికి 105 మంది సభ్యుల బలం అవసరం అవుతుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాల వల్ల కాంగ్రెస్-జేడీఎస్ కూటమి సంఖ్యాబలం 101కి క్షీణించింది.

బీజేపీకి ఆహ్వానం ఇక లాంఛనమే
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీకి తగినంత బలం ఉంది. ప్రస్తుతం ఆ పార్టీకి శాసనసభలో 105 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి గుడ్బై చెప్పిన ఇద్దరు స్వతంత్ర సభ్యులు ఆర్ శంకర్, నగేష్ కూడా ప్రస్తుతం బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీనితో ప్రతిపక్ష బీజేపీ సభ్యుల బలం 107కు చేరుతుంది. ఆయా సమీకరణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే- బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇక లాంఛనప్రాయమే అవుతుంది. ప్రత్యామ్నాయ పార్టీగా గవర్నర్ వజూభాయ్ వాలా బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించడం ఖాయమే.

ఇక బలపరీక్ష లేనట్టే!
తనకు తానుగా కుమారస్వామి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో- శాసనసభలో ఇక బలపరీక్షకు అవకాశం ఉండకపోవచ్చు. నిజానికి- గురువారం నాడే కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉండగా.. దాన్ని సోమవారం వరకూ వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. ఇక బల నిరూపణ తప్ప కుమారస్వామి ముందు మరో ప్రత్యామ్నాయం లేదు. బల పరీక్ష నిర్వహించాల్సి వచ్చిన తరువాతైనా ఆయన రాజీనామా తప్పదు. ఈ పరిస్థితుల్లో తన సంఖ్యాబలాన్ని నిరూపించుకోలేక పరువు పోగొట్టుకోవడం కంటే హుందాగా తప్పుకోవాలని కుమారస్వామి నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
-
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..!












Click it and Unblock the Notifications