8మంది భార్యలు.. ఆసుపత్రికి హెలికాప్టర్లో: ఇండియాలో కువైట్ సుల్తాన్ కథాకమామీషు..
కువైట్ సుల్తాన్ షేక్ షబ్ అహ్మద్ తన పరివారం మొత్తాన్ని వెంటపెట్టుకుని ఢిల్లీకి రావడం ఇప్పుడక్కడ హాట్ టాపిక్గా మారింది. ఆయన వెంట కువైట్ నుంచి అతని 8మంది భార్యలు, 30మంది ప్రతినిధి బృందం తరలివచ్చారు.
న్యూఢిల్లీ: చికిత్స కోసం ఢిల్లీలో అడుగుపెట్టిన కువైట్ సుల్తాన్.. మొత్తం కాందాన్ను వెంటపెట్టుకుని వచ్చాడు. హోటల్లో బస చేస్తున్న ఆయన కుటుంబం ఆసుపత్రిలో ఉన్న సుల్తాన్ను చూడటం కోసం.. ప్రతీరోజు హెలికాప్టర్ ఉపయోగిస్తుండటం విశేషం. అటు ఆసుపత్రిలో సైతం వీరి కోసం భారీ హంగు ఆర్భాటాలతో ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు.
కువైట్ సుల్తాన్ షేక్ షబ్ అహ్మద్ తన పరివారం మొత్తాన్ని వెంటపెట్టుకుని ఢిల్లీకి రావడం ఇప్పుడక్కడ హాట్ టాపిక్గా మారింది. ఆయన వెంట కువైట్ నుంచి అతని 8మంది భార్యలు, 30మంది ప్రతినిధి బృందం తరలివచ్చారు. గ్రేటర్ నోయిడాలోని జేపీ ఆసుపత్రిలో షేక్ చికిత్స పొందుతుండటంతో.. అక్కడికి 9కి.మీ దూరంలోని జేపీ హోటల్లో వీరు బస చేస్తున్నారు.
ప్రతీరోజు హోటల్ నుంచి ఆసుపత్రికి వెళ్లేందుకు షేక్ కుటుంబ సభ్యులు ప్రత్యేక హెలికాప్టర్ ఉపయోగిస్తున్నారు. గత సోమవారం ఢిల్లీ వచ్చిన వీరు శుక్రవారం వరకు ఇండియాలోనే ఉండనున్నారు. నిత్యం ఆసుపత్రికి వస్తుండటంతో.. సుల్తాన్ కుటుంబ సభ్యుల కోసం జేపీ ఆసుపత్రి ప్రత్యేక గదులను తీర్చిదిద్దింది. ప్రస్తుతం ఆసుపత్రిలో 29మంది వైద్యుల బృందం సుల్తాన్ కు చికిత్స అందిస్తోంది.